Thursday, December 9, 2010

సువర్ణ చిత్రాలు * తైలవర్ణ చిత్రలేఖనం

తైలవర్ణ చిత్రలేఖనం అనేది ఆరిపోయే తైల మాధ్యమానికి నిబద్ధమై ఉండే వర్ణద్రవ్యాలను ఉపయోగించే ఒక చిత్రలేఖన ప్రక్రియ - ప్రారంభ ఆధునిక ఐరోపాలో ఈ చిత్రలేఖన పద్ధతిలో సీమ అవిసె నూనె (లిన్సీడ్గ ఆయిల్‌)ను ఎక్కువగా ఉపయోగించేవారు. తరచుగా సీమ అవిసె నూనె వంటి చమురును దేవదారు సర్జరసం (రెసిన్‌) లేదా ఫ్రాంకిన్‌సెన్స్‌ (వివిధ అరేబియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంత చెట్ల నుంచి తయారు చేసే ఒక సుగంధ భరితమైన జిగురు రెసిన్‌తో వేడిచేస్తారు. వీటిని ’వార్నిషూలు’ అని పిలుస్తారు.

artsతైల వర్ణచిత్రానికి ఈ తైలాలు తక్కువగా పసుపు రంగులోకి మారడం లేదా వివిధ ఆరిపోయే సమయాలు వంటి వివిధ గుణాలను అందిస్తాయి. తైలం ఆధారంగా వర్ణచిత్రాల జిలుగులో కొన్ని వ్యత్యాసాలు కూడా కనిపిస్తాయి. చిత్రకారులు తరచుగా ఒకే వర్ణచిత్రంలో ప్రత్యేక వర్ణద్రవ్యాలు మరియు వాంఛిత ప్రభావాల ఆధారంగా వివిధ తైలాలను ఉపయోగిస్తారు. మాధ్యమం ఆధారంగా వర్ణచిత్రాలు వాటంతటవే ఒక నిర్దిష్ట అనుగుణతను అభివృద్ధి చేస్తాయి. ఐదు, తొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లో మొదటిసారి తైల వర్ణద్రవ్యాన్ని ఉపయోగించినప్పటికీ, 15వ శతాబ్దం వరకు దీనికి ప్రాచుర్యం లభించలేదు. మధ్యయుగంలో దీని వినియోగం పశ్చిమ దేశాలకు విస్తరించినట్లు భావనలు ఉన్నాయి. తైల వర్ణద్రవ్యం యొక్క ప్రయోజనాలకు విస్తృత గుర్తింపు లభించడంతో, చివరకు ఇది కళాఖండాలు సృష్టించేందుకు ఉపయోగించే ప్రధాన మాధ్యమంగా మారింది. ఈ సంప్రదాయం ఉత్తర ఐరోపాలో ప్రారంభ నెదర్లాండ్‌ చిత్రలేఖనంతో మొదలైంది, పునరుజ్జీవనోద్యమ ఉన్నతి సమయానికి తైలవర్ణ చిత్రలేఖన పద్ధతులు ఐరోపాలోని అనేక దేశాల్లో టెంపెరా వర్ణద్రవ్యాల స్థానాన్ని పూర్తిగా ఆక్రమించాయి.

arts1ఆండెర్స్‌ జోర్న్‌, స్వీయ చిత్రణ 1897: సాంప్రదాయిక తైలవర్ణ చిత్రలేఖన పద్ధతులు తరచుగా కళాకారుడు కాన్వాస్‌పై బొగ్గు లేదా పలచని వర్ణద్రవ్యంతో వస్తువు యొక్క స్థూల రూపం గీయడంతోపాటు ప్రారంభమవుతాయి. పలచని, వేగంగా లేదా నెమ్మదిగా ఆరిపోయే వర్ణాన్ని సృష్టించేందుకు కర్పూర తైలం (టర్పెంటైన్‌), సీమ అవిసె నూనె, కళా తరగతికి చెందిన ఖనిజ ద్రావకాలను లేదా ఇతర ద్రావకాలను తైల వర్ణద్రవ్యానికి కలుపుతారు. ‘ఫ్యాట్‌ ఓవర్‌ లీన్‌’ అంటే తైల వర్ణద్రవ్యం యొక్క ఒక ప్రాథమిక సూత్రం, (అంటే తైలవర్ణ చిత్రలేఖనంలో స్థిరమైన వర్ణ పొరను సృష్టించేందుకు తక్కువ తైల-వర్ణ నిష్పత్తి (లీన్‌-పలచని) గల వర్ణంపై అధిక తైలం-వర్ణ నిష్పత్తి (ఫ్యాట్‌-మందమైన) గల వర్ణాన్ని అద్దే పద్ధతి). సరిగా ఆరిపోయేందుకు వర్ణద్రవ్యం యొక్క ప్రతి అదనపు వర్ణ పొర దాని కింది పొర కంటే ఎక్కువ తైల పరిమాణం కలిగివుంటుంది. ప్రతి అదనపు పొర తక్కువ తైల పరిమాణాన్ని కలిగివున్నట్లయితే, తుది వర్ణచిత్రంలో పగులు ఏర్పడటం మరియు పొర ఊడిపోవడం జరుగుతుంది. తైలవర్ణ చిత్రలేఖనంలో ఉపయోగిం చేందుకు చల్లని మైనం, రెసిన్‌లు మరియు వార్నిష్‌ల వంటి అనేక ఇతర మాధ్యమాలు కూడా ఉన్నాయి.

కాంతి సారకత, వర్ణం యొక్క మెరుపు, వర్ణం యొక్క సాంద్రత లేదా నిలిపివుంచే గుణాన్ని మరియు కుంచె గీతలను నిలిపివుంచే లేదా దాచే సామర్థ్యాన్ని సర్దుబాటు చేయడంలో ఈ అదనపు మాధ్యమాలు చిత్రకారుడికి సాయపడతాయి. ఈ చరరాశులు తైల వర్ణద్రవ్యం యొక్క వ్యక్తీకరణ సామర్థ్యంతో దగ్గరి సంబంధం కలిగివుంటాయి.

arts3సాంప్రదాయికంగా, వర్ణద్రవ్యాన్ని వర్ణాన్ని అద్దే ఉపరితలానికి పేయింట్‌ బ్రష్‌లతో పూస్తారు, అయితే పాలెట్‌ నైవ్స్‌ (చిత్రకారులు ఉపయోగించే కత్తులు) మరియు వస్త్రాల పేలికలు ఉపయోగించే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. కళాకారులు ఉపయోగించే అనేక ఇతర పదార్థాల కంటే తైలవర్ణ చిత్రాలు ఎక్కువకాలం తడిగా ఉంటాయి, తద్వారా కళాకారుడికి వర్ణం, ఆకృతి లేదా బొమ్మ ఆకారాన్ని మార్చేందుకు వీలు ఉంటుంది. కొన్నిసార్లు, కళాకారుడు మొత్తం వర్ణపు పొరను తొలగించి, కొత్తదానిని ప్రారంభించవచ్చు. వర్ణద్రవ్యం తడిగా ఉన్నప్పుడు కొంత సమయంపాటు వస్తప్రేలిక మరియు కర్పూర తైలంతో పొరను తొలగించే వీలుంటుంది, అయితే గట్టిపడిన పొరను చెక్కి తొలగించాల్సి ఉంటుంది. తైల వర్ణద్రవ్యం ఆవిరికావడం వలన కాకుండా, ఆక్సీకరణ ద్వారా ఆరిపోతుంది, ఇది సాధారణంగా ఒక రోజు నుంచి రెండు వారాల్లో గట్టిపడుతుంది. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో వార్నిష్‌ పూసేందుకు వీలైన పొడిబారిన స్థితికి చేరుకుంటుంది. కళా పరిరక్షకులు 60 నుంచి 80 ఏళ్ల తరువాత తైల వర్ణచిత్రం పూర్తిగా ఆరిపోయినట్లు పరిగణిస్తారు.

తైలవర్ణచిత్రం పుట్టుక: తైలవర్ణ చిత్రలేఖనం ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి పశ్చిమ దేశాలకు విస్తరించాయనే వాదనకు ఇటీవలి పరిశోధనలు మద్దతు ఇస్తున్నాయి.1234 బామ్యాన్‌ బౌద్ధ విగ్రహాలు బయటపడిన తైల వర్ణచిత్రాల ఉపరితలాలు కవచాలు మాదిరిగా ఉన్నాయి. పోటీలు, అలంకరణలు రెండింటికీ వీటిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. సాంప్రదాయిక టెంపెరా వర్ణాల కంటే తైల-ఆధారిత మాధ్యమంలో చిత్రాలు గీసినప్పుడు అవి మరింత మన్నిక పొందుతాయి.

arts2అనేక పునరుజ్జీవనోద్యమ మూలాలు, ముఖ్యంగా వాసారీ గ్రంథాలు, 15వ శతాబ్దపు ఉత్తర ఐరోపా చిత్రకారులు ప్రధానంగా జాన్‌ వాన్‌ ఐక్‌ చెక్క పలకపై తైల మాధ్యమాలతో చిత్రలేఖన ప్రక్రియను కనిపెట్టినట్లు సూచిస్తున్నాయి, అయితే థియోఫిలస్‌ వివిధ కళలపై 1125లో రాసిన తన గ్రంథంలో తైలవర్ణ ఆధారిత చిత్రలేఖనానికి స్పష్టమైన నిర్దేశాలను ఇచ్చారు. ఈ కాలంలో దీనిని బహుశా బాహ్య వినియోగం కోసం వివిధ రకాల శిల్పాలు, చెక్క అమర్పులకు రంగులు వేసేందుకు ఉపయోగించివుండవచ్చు.

అయితే 15వ శతాబ్దంలో ప్రారంభ నెదర్లాండ్స్‌ చిత్రలేఖనం తైలాన్ని సాధారణ చిత్రలేఖన మాధ్యమంగా మొదటిసారి ఉపయోగించింది, పొరలు మరియు తళుకుల వినియోగాన్ని అన్వేషించడం జరిగింది, దీని తరువాత మిగిలిన ఉత్తర ఐరోపా, ఆపై ఇటలీ ఈ చిత్రలేఖన పద్ధతిని స్వీకరించాయి. ప్రారంభ చిత్రాలు చెక్కపై పలక వర్ణచిత్రాలుగా ఉన్నాయి, అయితే 15వ శతాబ్దం ముగిసే సమయానికి కాన్వాస్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఇది తక్కువ ఖర్చుతో కూడుకొని ఉండటంతోపాటు, సులభంగా రవాణా చేసే వెసులుబాటు, పెద్ద కళాఖండాల సౄఎష్టికి అవకాశం కల్పించింది. తెరచాప-కాన్వాస్‌ సులభంగా దొరికే వెనిస్‌ నగరం దీనిని నేతౄఎత్వం వహించింది. ఉత్తర ప్రాంతం నుంచి ఇటలీకి వ్యాప్తి చెందిన తైలవర్ణాలు 15వ శతాబ్దంలో వెనిస్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1540నాటికి పలకపై చిత్రాలు గీసే పూర్వ పద్ధతి టెంపెరా దాదాపుగా కనుమరుగయింది, అయితే ఉత్తర వాతావరణాల్లో ఇది బాగా కష్టమైన పనిగా ఉన్న కుడ్య చిత్రాలకు మాత్రం ఇటాలియన్‌లు ఫ్రెస్కోను ఉపయోగించడం కొనసాగించారు.

తైలవర్ణ చిత్రలేఖనానికి ఆధారాలు: పాల్మాయిల్‌ గియోవన్‌ గీసిన ఫ్రాన్సెస్కో సెయింట్‌ జోరెమ్‌, సుమారుగా 1590.ఇది రాగిపై తైలవర్ణ చిత్రలేఖనానికి ఒక అరుదైన ఉదాహరణ. సాంప్రదాయిక కళాకారుల యొక్క కాన్వాస్‌ను పీచు (లినెన్‌) నుంచి తయారు చేస్తారు, అయితే తక్కువ ఖర్చుతో కూడిన పత్తి వస్త్ర వినియోగానికి ప్రాచుర్యం ఏర్పడింది. స్ట్రెచర్‌ లేదా స్ట్రైనెర్‌గాపిలిచే ఒక చెక్క పలకను మొదట కళాకారుడు సిద్ధం చేసుకుంటాడు. మొదటి మరియు రెండోదాని మధ్య వ్యత్యాసం ఏమిటంటే స్ట్రెచర్‌లను కొద్దిగా సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది, ఇదిలా ఉంటే స్ట్రైనర్‌లు దృఢంగా , సర్దుబాటు చేయగలిన మూలలు కలిగివుంటాయి. కాన్వాస్‌ను తరువాత చెక్క చట్రంపై పరుస్తారు, వెనుకవైపు దీనిని బలంగా కట్టివేస్తారు. తరువాత, కళాకారుడు వర్ణద్రవ్యం యొక్క ఆమ్ల లక్షణాల నుంచి కాన్వాస్‌ను వేరుచేసేందుకు ఒక జిగురు పదార్థాన్ని పూస్తారు. సాంప్రదాయికంగా, కాన్వాస్‌పై జంతువుల జిగురు (సైజ్‌) పొరతో, (ఆధునిక కళాకారులు కుందేలు చర్మ జిగురును ఉపయోగిస్తారు) మరియు ప్రధానంగా సీసపు తెలుపు వర్ణంతో, కొన్నిసార్లు అదనపు సున్నంతో పూత పూస్తారు. పలకలను జిగురు మరియు సున్నం మిశ్రమమైన గెస్సోతో తయారు చేస్తారు.

ఆధునిక అక్రిలిక్‌ గెస్సోను ఒక అక్రిలిక్‌ బైండర్‌తో టైటానియం డైయాక్సైడ్‌ నుంచి తయారు చేస్తారు. దీనిని తరచుగా కాన్వాస్‌పై ఉపయోగిస్తారు, ఇక్కడ నిజమైన గెస్సో వినియోగానికి అనుకూలంగా ఉండదు. కళాకారుడు వివిధ గెస్సో పొరలను పూయవచ్చు, ఒక పొర ఆరిపోయిన తరువాత మరోదానిని పూయడం జరుగుతుంది. అక్రిలిక్‌ గెస్సోను గరుకు కాగితంతో గీకడం కష్టంతో కూడుకొని ఉంటుంది. ఒక తయారీదారు దీనికి అనుగుణమైన అక్రిలిక్‌ గెస్సోను తయారు చేశారు, అయితే పలకలకు మాత్రమే ఉద్దేశించబడింది, కాన్వాస్‌లకు పనికిరాదు.గత కొన్ని దశాబ్దాల్లో, అనేక కృత్రిమ కుంచెలు అందుబాటులోకి వచ్చాయి.

No comments:

Post a Comment