తైలవర్ణ చిత్రలేఖనం అనేది ఆరిపోయే తైల మాధ్యమానికి నిబద్ధమై ఉండే వర్ణద్రవ్యాలను ఉపయోగించే ఒక చిత్రలేఖన ప్రక్రియ - ప్రారంభ ఆధునిక ఐరోపాలో ఈ చిత్రలేఖన పద్ధతిలో సీమ అవిసె నూనె (లిన్సీడ్గ ఆయిల్)ను ఎక్కువగా ఉపయోగించేవారు. తరచుగా సీమ అవిసె నూనె వంటి చమురును దేవదారు సర్జరసం (రెసిన్) లేదా ఫ్రాంకిన్సెన్స్ (వివిధ అరేబియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంత చెట్ల నుంచి తయారు చేసే ఒక సుగంధ భరితమైన జిగురు రెసిన్తో వేడిచేస్తారు. వీటిని ’వార్నిషూలు’ అని పిలుస్తారు.
కాంతి సారకత, వర్ణం యొక్క మెరుపు, వర్ణం యొక్క సాంద్రత లేదా నిలిపివుంచే గుణాన్ని మరియు కుంచె గీతలను నిలిపివుంచే లేదా దాచే సామర్థ్యాన్ని సర్దుబాటు చేయడంలో ఈ అదనపు మాధ్యమాలు చిత్రకారుడికి సాయపడతాయి. ఈ చరరాశులు తైల వర్ణద్రవ్యం యొక్క వ్యక్తీకరణ సామర్థ్యంతో దగ్గరి సంబంధం కలిగివుంటాయి.
తైలవర్ణచిత్రం పుట్టుక: తైలవర్ణ చిత్రలేఖనం ఆఫ్ఘనిస్థాన్ నుంచి పశ్చిమ దేశాలకు విస్తరించాయనే వాదనకు ఇటీవలి పరిశోధనలు మద్దతు ఇస్తున్నాయి.1234 బామ్యాన్ బౌద్ధ విగ్రహాలు బయటపడిన తైల వర్ణచిత్రాల ఉపరితలాలు కవచాలు మాదిరిగా ఉన్నాయి. పోటీలు, అలంకరణలు రెండింటికీ వీటిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. సాంప్రదాయిక టెంపెరా వర్ణాల కంటే తైల-ఆధారిత మాధ్యమంలో చిత్రాలు గీసినప్పుడు అవి మరింత మన్నిక పొందుతాయి.
అయితే 15వ శతాబ్దంలో ప్రారంభ నెదర్లాండ్స్ చిత్రలేఖనం తైలాన్ని సాధారణ చిత్రలేఖన మాధ్యమంగా మొదటిసారి ఉపయోగించింది, పొరలు మరియు తళుకుల వినియోగాన్ని అన్వేషించడం జరిగింది, దీని తరువాత మిగిలిన ఉత్తర ఐరోపా, ఆపై ఇటలీ ఈ చిత్రలేఖన పద్ధతిని స్వీకరించాయి. ప్రారంభ చిత్రాలు చెక్కపై పలక వర్ణచిత్రాలుగా ఉన్నాయి, అయితే 15వ శతాబ్దం ముగిసే సమయానికి కాన్వాస్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఇది తక్కువ ఖర్చుతో కూడుకొని ఉండటంతోపాటు, సులభంగా రవాణా చేసే వెసులుబాటు, పెద్ద కళాఖండాల సౄఎష్టికి అవకాశం కల్పించింది. తెరచాప-కాన్వాస్ సులభంగా దొరికే వెనిస్ నగరం దీనిని నేతౄఎత్వం వహించింది. ఉత్తర ప్రాంతం నుంచి ఇటలీకి వ్యాప్తి చెందిన తైలవర్ణాలు 15వ శతాబ్దంలో వెనిస్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1540నాటికి పలకపై చిత్రాలు గీసే పూర్వ పద్ధతి టెంపెరా దాదాపుగా కనుమరుగయింది, అయితే ఉత్తర వాతావరణాల్లో ఇది బాగా కష్టమైన పనిగా ఉన్న కుడ్య చిత్రాలకు మాత్రం ఇటాలియన్లు ఫ్రెస్కోను ఉపయోగించడం కొనసాగించారు.
తైలవర్ణ చిత్రలేఖనానికి ఆధారాలు: పాల్మాయిల్ గియోవన్ గీసిన ఫ్రాన్సెస్కో సెయింట్ జోరెమ్, సుమారుగా 1590.ఇది రాగిపై తైలవర్ణ చిత్రలేఖనానికి ఒక అరుదైన ఉదాహరణ. సాంప్రదాయిక కళాకారుల యొక్క కాన్వాస్ను పీచు (లినెన్) నుంచి తయారు చేస్తారు, అయితే తక్కువ ఖర్చుతో కూడిన పత్తి వస్త్ర వినియోగానికి ప్రాచుర్యం ఏర్పడింది. స్ట్రెచర్ లేదా స్ట్రైనెర్గాపిలిచే ఒక చెక్క పలకను మొదట కళాకారుడు సిద్ధం చేసుకుంటాడు. మొదటి మరియు రెండోదాని మధ్య వ్యత్యాసం ఏమిటంటే స్ట్రెచర్లను కొద్దిగా సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది, ఇదిలా ఉంటే స్ట్రైనర్లు దృఢంగా , సర్దుబాటు చేయగలిన మూలలు కలిగివుంటాయి. కాన్వాస్ను తరువాత చెక్క చట్రంపై పరుస్తారు, వెనుకవైపు దీనిని బలంగా కట్టివేస్తారు. తరువాత, కళాకారుడు వర్ణద్రవ్యం యొక్క ఆమ్ల లక్షణాల నుంచి కాన్వాస్ను వేరుచేసేందుకు ఒక జిగురు పదార్థాన్ని పూస్తారు. సాంప్రదాయికంగా, కాన్వాస్పై జంతువుల జిగురు (సైజ్) పొరతో, (ఆధునిక కళాకారులు కుందేలు చర్మ జిగురును ఉపయోగిస్తారు) మరియు ప్రధానంగా సీసపు తెలుపు వర్ణంతో, కొన్నిసార్లు అదనపు సున్నంతో పూత పూస్తారు. పలకలను జిగురు మరియు సున్నం మిశ్రమమైన గెస్సోతో తయారు చేస్తారు.
ఆధునిక అక్రిలిక్ గెస్సోను ఒక అక్రిలిక్ బైండర్తో టైటానియం డైయాక్సైడ్ నుంచి తయారు చేస్తారు. దీనిని తరచుగా కాన్వాస్పై ఉపయోగిస్తారు, ఇక్కడ నిజమైన గెస్సో వినియోగానికి అనుకూలంగా ఉండదు. కళాకారుడు వివిధ గెస్సో పొరలను పూయవచ్చు, ఒక పొర ఆరిపోయిన తరువాత మరోదానిని పూయడం జరుగుతుంది. అక్రిలిక్ గెస్సోను గరుకు కాగితంతో గీకడం కష్టంతో కూడుకొని ఉంటుంది. ఒక తయారీదారు దీనికి అనుగుణమైన అక్రిలిక్ గెస్సోను తయారు చేశారు, అయితే పలకలకు మాత్రమే ఉద్దేశించబడింది, కాన్వాస్లకు పనికిరాదు.గత కొన్ని దశాబ్దాల్లో, అనేక కృత్రిమ కుంచెలు అందుబాటులోకి వచ్చాయి.
No comments:
Post a Comment