Monday, December 19, 2011

వర్తమానమే వాస్తవం!

 
"గతంలో ఆ పొరపాటే చేసి ఉండకపోతే, ఇప్పుడు ఈ దుస్థితి ఉండేదే కాదు. ఏం చేస్తాం? భవిష్యత్తులో నైనా అలాంటి తప్పిదం మరోసారి జరగకుండా చూసుకోవాలి.''ఇలాంటి మాటలు ఎక్కడైనా విన్నప్పుడు, వారికేదో గొప్ప జ్ఞానోదయం అయినట్లే అనిపిస్తుంది. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన చేస్తున్నదేమిటి? గతంలో చేసిన తప్పు, భవిష్యత్తులో చేయకుండా జాగ్రత్తపడతా అంటున్నాడు. బాగానే ఉంది. కానీ, వర్తమానం మాటేమిటి? వర్తమానంలో మాత్రం ఆ తప్పే కొనసాగిస్తాడనేగా? లేదంటే, గతం గురించి, భవిష్యత్తు గురించీ మాట్లాడి వర్తమానాన్ని ఎందుకు వదిలేసినట్లు? పూర్తి స్ఫురణతో అయినా, కాకున్నా, మనసు చాలాసార్లు అలా వర్తమానం నుంచి పక్కకు జరిగిపోతూనే ఉంటుంది. అనుభవాలు నేర్పిన జీవిత పాఠాలను యథాతథంగా భవిష్యత్తులోకి బదిలీ చేయడం వల్ల కలిగే విపత్తే ఇది. నిజానికి మనముందు గత మూ లేదు, భవిష్యత్తూ లేదు. ఉన్నదల్లా వ ర్తమానమే. కానీ, చాలా సార్లు ఆ వర్తమానం మీదే మనసు నిలవదు.

* * * "ఇప్పుడేదో ఈ కాస్తకే తెగమురిసిపోతున్నారు కానీ, ఆ రోజుల్లో మేము ఎన్నెన్ని అద్భుతాలు చేశామండి?'' "అవునవును వాటిని చూసిన వారంతా నిజంగా ఎంత ఆశ్చర్యపోయే వారని? మేము చేసిన ఏ పనికీ అసలు తిరుగే ఉండేది కాదు." కొందరి సంభాషణల్లో ఎంతసేపూ ఇలా గత వైభవాల గురించిన ఆత్మస్తుతే ఉంటుంది. గతంలో వారు కొన్ని అద్భుతాలే చేసినా, ఆ ఆ వైభవాన్ని ఎంత కాలమని భుజాల మీద వేసుకుని తిరుగుతారు? గతం ఘనకీర్తి కాదు, ఇక్కడ, ఇప్పుడేం చేస్తున్నారన్నది కదా ముఖ్యం ? నిజానికి వర్తమానంలో నిర్జీవంగా మారిపోయిన వారే ఇలా అస్తమానం గతంలో జీవిస్తూ గడిపేస్తారు. అయినా, అంతంత సమయం గతంలో జీవిస్తున్నారూ అంటే, వర్తమానంలో వారు లేరనే కదా అర్థం? వాస్తవానికి, నువ్వు సంపూర్ణంగా ఉన్న చోట గతానికి తావే ఉండదు. ? నవ్వున్న చోట గతమే ఉందీ అంటే అక్కడ నువ్వు లేవనే కదా!
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEju_t6EZT7Zw0yCyTBShWrFrGhSOmT0jXVKKA3mzJm0JswYsI8GQThHa3ojkolOnu2WgK1UQypMEkmzZLnBXrXfJkD5m4hR0Lqg9TABb_yEynE3IkunQaz763ea8IUwtEq3TrDf6XgDJite/s1600/Vision.jpg
 తప్పించుకోవడమే
పెద్ద అవసరం లేకపోయినా, గతం గురించి ఆలోచించడం, దాని గురించి మాట్లాడటం నిజంగా వర్తమానాన్ని పక్కకు తప్పించే ప్రయత్నమే. అయితే మనకు తెలియకుండానే కొంత మేరకు గతం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. బాల్యం నాటి కొన్ని అనుభవాలు, పెరిగిన సంస్కృతి, దేశ కాల పరిస్థితులు, మన వెంట నీడలా నడుస్తూనే ఉంటాయి. ప్రపంచం పట్ల మన దృక్ఫథాన్ని, ఆలోచనల్ని, మన స్పందనల్ని, మనం ఏర్పచుకునే మానవ సంబంధాల్ని ఇవి ఏదో ఒక స్థాయిలో ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అయితే వర్తమానంలోకి విస్తృతంగా వ్యాపించడం ద్వారా మాత్రమే ఆ ప్రభావాల నుంచి బయటపడటం సాధ్యమవుతుంది. అలా వ్యాపించడానికి వర్తమానం విశిష్టత గురించి తెలియాలి. అలా వర్తమానం గురించి సమగ్రంగా తెలిసి, దానికి అంకితమయ్యే దాకా గతం నీడలోనుంచి పక్కకు జరగడం సాధ్యం కాదు. వర్తమానం మీద తమను తాము నిలబెట్టుకోవడం ద్వారానే జీవితం నిలబడుతుంది. గ తాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పెంచే కొద్దీ విషయం మరింత సంక్లిష్టమవుతూ వెళుతుంది.
http://hrushikeshzadgaonkar.files.wordpress.com/2011/06/simplify-your-life.jpg?w=640
సంసిద్ధతే ముఖ్యం
వర్తమానంలోని ఘర్షణనూ, బాధనూ ఎదుర్కోవడానికి సిద్దం కాలేక కూడా మనసు కొన్నిసార్లు గతంలోకి, భవిష్యత్తులోకీ దూరిపోతూ ఉంటుంది. అలాగే, తమలోని అలసత్వాన్నీ, అశక్తతనూ, పలాయనత్వాన్నీ సోమరితనాన్నీ కప్పి పుచ్చుకోవడానికి కొందరు చాలా తెలివిగా గతం లేదా భవిష్యత్తు ముసుగును కప్పుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన ఊహా సౌధంలో తిరుగుతూ కాలం వెలిబుచ్చుతూ ఉంటారు. అలా పక్కకు జరిగిపోవడం వల్ల వర్తమాన విషయాలు మరింత జటిలంగానూ, సంక్లిష్టంగానూ తయారవుతాయి. వర్తమానం దుర్భరంగా మారిన వారిలో కొందరు ఈ కోవకే చెందుతారు. నిజంగానే భవిష్యత్తులో ఏదో అద్భుతమే జరగాలనుకుంటే, వర్తమానంలో దానికి పునాదులు పడాలి. ఆ స్థాయిలో కార్యాచరణ కూడా ఉండాలి. అదేమీ లేకుండా నిరంతరం గతంలోని తమ ప్రతాపం గురించి, ఉత్తుత్తి ఉజ్వల భవిష్యత్తు గురించి అనుకుంటూ పోవడం క చ్ఛితంగా పలాయనమే అవుతుంది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj49Tty3dpwV4719s0asEhiHyRpDMHAzoGJ-MjF2t2iTI5cTMHqTuxL0AuITqmX-c3-NKFzmx0yY3UljLbLaOvOoIdyfI2wYgbRtSdz5Fn6KjazZkKaTFANrR21oemiFHHziR58Yh5mMvI/s400/normal_TreeofLife.jpg
ఎందుకిలా?
అసలు మనసెందుకు ఇలా పదేపదే గతంలోకి, భవిష్యత్తులోకి జారుకుంటుంది? వర్తమాన జీవితంలో శ్రమ, ఘర్షణ, బాధ ఇవన్నీ ఉంటాయి. ఈ స్థితిలో గతంలో శ్రమించిన రోజుల్ని సైతం గుర్తు చేసుకుంటాం. కారణం, ఆ గుర్తు చేసుకోవడంలో శ్రమ గురించిన జ్ఞాపకాలే తప్ప శ్ర మ ఉండదు. అందుకే అవి భారంగా అనిపించవు. అయినా, జీవితం తాలూకు ఘర్షణ జీవిత వాస్తవం అయినప్పుడు ఆ ఘర్షణ నుంచి పక్కకు జరిగితే ఫలితమేముంది? అంటే మానసిక వేత్త ఎక్కార్ట్ టోల్ " వర్తమానం అంత బాధాకరంగా అనిపించడానికి వర్తమానాన్ని యథాతథంగా స్వీకరించలేని తనమే ప్రధాన కారణం. పరిష్కరించే ప్రయత్నమేదీ లేకుండా సమస్యలను నిరో«ధించే ప్రయత్నాలే ఆ సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. నిజానికి వర్తమానపు బాధల తీవ్రత వర్తమానాన్ని నిరోధించే స్థాయి మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. చేయవలసిందల్లా వర్తమాన స్థితి గతుల్ని యథాతథంగా స్వీకరించడానికి సిద్ధం కావడమే. అప్పుడే అ పరిస్థితుల్ని చక్కదిద్దడం గానీ, సమస్యల్ని పరిష్కరించడం గానీ సాధ్యమవుతుంది. '' అంటాడు.

వర్తమానమే సమస్తమై....

అదేపనిగా, గతం, భవిష్యత్తుల గురించి చేసే ఆలోచనలు, వర్తమానాన్ని నిర్జీవ పరిచి జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఒక తీవ్రమైన బాధ శరీరాన్నీ మనసునూ ఆక్రమిస్తుంది. జీవిత బంధం గతంలోంచే కొనసాగుతుంది. గతంతో నీ అనుబంధాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమించావు, ద్వేషించావు. స్నేహాలు చేశావు. వైరాలు పెంచుకున్నావు. అవన్నీ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. కానీ, ఆ విషయాల్లో తలమునకలు కావడం మొదలెడితే, వర్తమానాన్ని, బతికే ఇప్పటికి ఈ క్షణాలను పూర్తిగా పోగొట్టుకుంటాం. మనసంతా గతమూ, భవిష్యత్తుల గురించిన ఆలోచనలే నిండిపోతే, వర్తమానానికింక చోటు ఎక్కడుంటుంది? పరిష్కరించవలసిన ఎంతో వర్తమానం మన ముందు పడి ఉంది. అందుకే గతమూ, భవిష్యత్తూ కాదు. ఈ క్షణమే మనకు సమస్తం అందులో సమగ్రంగా జీవించడమే ముఖ్యం. వర్తమానంలో సమగ్రంగా జీవించగలిగితే భవిష్యత్తు దానికదే ఏర్పడుతుంది. అందుకే సర్వశక్తుల్నీ వర్తమానం మీదే కేంద్రీకృతం చేయడం ఒక్కటే ఇప్పుడు మనిషి ముందున్న ఏకైక లక్ష్యం.

Friday, December 2, 2011

మనసే మన గురువు

మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ- పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ'లోచనం' చేసేదే మనసు. మనలో ఉండి మనలను నడిపించే మనసే మన 'తొలిగురువు' అంటోంది వేదసారం. 'నీవెవరో తెలుసుకో' అని బోధించిన రమణ మహర్షుల వారైనా 'నీవే ప్రపంచం' అన్న జిడ్డు కృష్ణమూర్తి తత్వమైనా నీలో ఉన్న ప్రపంచాన్ని నిన్నే చూడమంటోంది.

ఆలోచన అనగానే మన మనసు అనే జల్లెడ మంచిని, చెడును వేరు చేసే పరికరంలాగా పనిచేస్తుంది. ఆచరణలో మాత్రం మంచిని తీసుకుని చెడును వదిలివేస్తాం. ఒక్కోసారి చెడును కూడా మంచిగా భావించి మనసు మొండికేస్తూ మంచిని విస్మరిస్తుంది. ఎవరి సలహాను కూడా ఈ మనసు పరిగణనకు తీసుకోదు. కాని, ఈ ఆలోచన సాధారణంగా ఒక సమస్యపై ఉంటుంది. ఆ సమస్య మనం తలపెట్టిన ఒక నూతన కార్యం కావచ్చు. లేక గత కాలంలో మనం చేసిన కర్మ వలన ఏర్పడిన దుష్ఫలితాలపై ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో శరీర ఆరోగ్యాన్ని గురించి కూడా ఉండవచ్చు.

ఈ ఆలోచన అనే ప్రక్రియ సాధారణంగా బాహ్య వాతావరణానికి సంబంధించి ఉంటుంది. ఏ పరిస్థితులలోను ఈ మనసు తన గురించి తాను ఆలోచించదు. ఈ ఆలోచన జీవితంలో జరిగే ఒడిదుడుకుల గురించి కాని, కొన్ని కోరికల గురించి కాని జరుగుతుంది. బాహ్యాన్ని గురించి జరిగే ఈ చింతన ప్రక్రియనే ఆలోచన అంటాం. కాని ఈ ఆలోచన ప్రక్రియ మనలోపల ఉన్న మనసులోనే జరుగుతుంది. మనకు కొన్ని సందర్భాలలో ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకనపుడు బాగా అనుభవం ఉన్న, మనకు సన్నిహితుడైన వ్యక్తిని ఆ సలహా మనకు నచ్చితే దానిని పాటిస్తాం. ఈ ప్రక్రియ సహజంగా లోకంలో జరిగేదే.

మనసే ఒక లోచనం
ఆలోచన అనే పదంలోనే 'ఆ' అంటే ఎక్కడో దూరంగా మనకన్నా భిన్నంగా గాని మనకన్నా వేరుగా ఉన్నదాన్ని సూచిస్తుంది. ఆలోచనంలో ఉన్న 'లోచనం' అంటే కన్ను అని అర్థం. అంటే దీన్ని బట్టి చూస్తే మన మనసే ఒక కన్ను అనవచ్చు. ఈ మనసు అనే కన్ను ఎంత సేపటికి బయటకే పరుగెడుతుంది కాబట్టి దీన్ని ఆలోచనం అంటున్నాం. అంటే బాహ్యంగా ఉన్న విషయాన్ని మనలోనే ఉన్న మనసుతోనే చూస్తున్నాం.

ఇక మనకు తెలియని విషయాన్ని తెలియబరిచే వ్యక్తిని 'గురువు' అంటారు. కేవలం మనుషులే కాదే ఒక్కోసారి ఒక సంఘటన, పశువులు, పక్షులు, కొండలు, గుట్టలు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని సూచించవచ్చు. బాగా పరిశీలించి చూస్తే అందరి అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి కూడా గురువే అవుతుంది. దత్తచరిత్ర కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. ఏదేమైనా మనలోనే ఉండి మనను నడిపించే మనసు చెప్పినట్లే సమస్యకు పరిష్కారాన్ని, ప్రశ్నకు జవాబును తెలుసుకుంటున్నాం. అందువల్ల మన మనసును కూడా 'గురువు'గానే పరిగణించాలి.

అంతర్గత ప్రయాణం
సాధారణంగా వేదాంతం అనగానే మన పెద్దలందరూ నీలో నీవు చూడమని, నీ లోనికి నీవు ప్రయాణం చేయాలని చెబుతారు. శ్రీరమణ మహర్షుల వారు కూడా 'నీవు ఎవరో తెలుసుకో' అని పదే పదే చెప్పేవారు. మనకు సుపరిచితాలైన పదాలు రెండు ఉన్నాయి. 'అక్కడ', 'ఇక్కడ' అనేవి ఆ రెండు పదాలు. అక్కడ అనగానే మనకు దూరంగా ఉన్నదని తెలుసు. ఇక్కడ అంటే మనకు దగ్గర్లో ఉన్నదని కూడా మనకు తెలుసు.

ఈ దగ్గర అనే దాన్లో మన ఇంట్లో కావచ్చు, మనం కూర్చునే చోట పక్కన కావచ్చు, మన జేబులో కావచ్చు. అలాంటప్పుడు మనలో అని ఎందుకు అనకూడదు? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ విషయాన్ని ఉపనిషత్తు దర్శనం తెలియచేస్తుంది. పైగా మన మనసు అనేది మనలో ఉన్నదే కాబట్టి వారు చెప్పే సలహా లేక సూచన కూడా మనలో ఉన్నదేనని విదితమవుతుంది. అదే వేదాంతం కూడా బయట(నీకంటే వేరైన) ప్రపంచాన్ని చూడవద్దంటుంది. అంటే నీలో ఉన్న ప్రపంచాన్ని నిన్ను నీవే చూడమంటుంది. ఇదే సంగతిని జిడ్డు కృష్ణమూర్తి కూడా 'నీవే ప్రపంచం' అంటారు.

కాబట్టి నీలోనే ఉండి నీకు మార్గదర్శనం చేసే నీ మనసునే బాగా విచారించమనేదే మన పెద్దల ఉపదేశాలసారం. మనలో ఉండి మనలను నడిపించే మనసే తొలిగురువు. అయితే ఈ మనసు ఎల్లప్పుడు బయటి విషయాలకు పోయి పరుగులు పోతూ పిచ్చిపట్టిన కోతిలా పరుగెడుతుందే తప్ప ఒక్క క్షణం నిలకడగా ఉండదు. నిలకడగా ఉండే అలవాటు దీనికి లేదు. ఒకవేళ ఎవరైనా, ఎప్పుడైనా నిలువరించాలని ప్రయత్నం చేస్తే అప్పుడు మరీ వేగంగా గతాన్ని అనాగతాన్ని తలచుకుని వేగాన్ని మరింత పెంచుతుంది. కాబట్టి ఈ వేగాన్ని అభ్యాసవశాన వశపరుచుకోవలసిందే.

మనసు వేగాన్ని నియంత్రించడానికి మనసును దాని చేతనే ఆలోచింపచేయాలి. తదుపరి అభ్యాసవశాన క్రమంగా నిలకడకు తీసుకురావాలి. అంతేగాని మనము దానిపై నియంత్రించడానికి పట్టు బిగుస్తున్న కొద్ది అది మరింత వేగాన్ని పెంచి మొండికేస్తుంది. కాబట్టి దీనిని అభ్యాసం మాత్రమే చక్కదిద్దగలదు. దీనినే తటస్థీకరణ లేక సాక్షిణ్యం అంటారు. ఈ ప్రక్రియనే పెద్దలు 'లోచూపు' అంటారు. మరలా 'లోప్రయాణం', 'నీలోనికి నీవే ప్రయాణం' అనవచ్చు.

అంతేగాని లోచూపు అనగానే మన కనుగ్రుడ్లు లోపలివైపునకు తిప్పి చూడమని కానే కాదు. ఇది అసాధ్యం. సహజత్వానికి విరుద్ధం. మొత్తానికి తేలిందేమంటే మన మన మనసుతోనే మన మనసు చేసే చర్యలను, ఆ మనసు పుట్టుకను, దాని తారతమ్యాలను, దానికి ఉన్న అనేక స్థితులను బాగా పరిశీలించి పరిశోధించాలన్నదే ఈ లోని ప్రయాణం.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgxHHFrnna4MGTNLsWBv4T-LmeXQued76yAHm6xCgtcfNG2d2zw2XYk0TYRtdygpxdi0FIrBPv3ISd-nuNewMNdjrPd_p5lGFCThpaesWlhzbCDW1Luaze-0mIUxO-mFJizdY4zrE-HYLA/s1600/Pair5.JPG
మన మనసునేగాక మనసుకు మందిరంగా ఉన్న శరీరాన్ని గురించి, దాని అన్ని ప్రక్రియలను గురించి అనేక విధాలుగా పరిశీలించాలన్నదే దీని సారం. ముందుగా శరీరాన్ని, అందులో దాగి ఉన్న మనసు అనే ఆంతరిక ఉపకరణాన్ని నిశితంగా, తులనాత్మకంగా పరిశీలించి పరిశోధించాలి. చివరిగా ఒక సంతులన స్థితికి రావాలి. రమణులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి మహానుభావులే కాదు ఈ పుడమిపై మానవుడు పుట్టిన నాటి నుంచి మహామహులంతా ఉపదేశించిన వేద సారం ఇదే.

వేదంలో నుంచే వేదన
ఈలోచనం అంటే తనను, తన మనసును తన మనసు చేతనే పరిశీలించాలి. 'వేద' అనే పదంలోనుంచే వేదన అనే పదం పుట్టుకొచ్చింది. కాబట్టి వేదన నుంచి బయటపడాలంటుంది వేదం(వేదన=దుఃఖం). తనను తాను తెలుసుకున్నపుడు ఆ మనసు శాంతిస్తుంది. ఇది వేదనను అంతం చేసేది కాబట్టి దీనిని వేదాంతం అన్నారు. అంతేకాని వేదాంతం అనగానే మనకు అర్థమయ్యేది కాదని, అది ఒంటబట్టేది కాదని, దాని ఇది వయసు కాదని భూతద్దంలో చూసి భయపడవలసిన అవసరం లేదు.

స్త్రీల విషయంలో మరో ముఖ్యాంశం ఏమిటంటే వారు వేదాంత అర్హులు కారని ఒక వాదన ప్రజలలో బలంగా ఉంది. ఇది వాస్తవం కాదు. విద్యకు ఆది మాత, విద్యాప్రదాయిని సరస్వతి స్త్రీమూర్తి. ఈ సరస్వతీ మాతకు మరో పేరే గాయత్రి. వీరందరూ స్త్రీమూర్తులే కదా! ఈ విషయం మరువరాదు. అలాంటప్పుడు స్త్రీలకు విద్యాధికారం, వేదాధికారం ఎందుకు లేదు? మన మనసును గురించి, దానికి భవనమైన మన దేహాన్ని గురించి అంతఃశోధన జరిగినపుడు మన మనసు గురించి మరింత లోతైన అవగాహన ఏర్పడగలదు.

శరీరాన్ని, అందులో దాగి ఉన్న మనసు అనే ఆంతరిక ఉపకరణాన్ని నిశితంగా, తులనాత్మకంగా పరిశీలించి పరిశోధించాలి. చివరిగా ఒక సంతులన స్థితికి రావాలి. రమణులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి మహానుభావులే కాదు ఈ పుడమిపై మానవుడు పుట్టిన నాటి నుంచి మహామహులంతా ఉపదేశించిన వేద సారం ఇదే.
- కర్ల సుబ్బారావు

Friday, November 25, 2011

ఆత్మజ్ఞాన సోపానం

ప్రతి మనిషి తన జీవన యానంలో మోయలేని 'భారాల్ని' మోస్తున్నాడు! ఏమిటా భారాలు? బంధాలు, భౌతిక వస్తు లాలసలు. ఇన్ని బరువులతో ప్రయాణిస్తే జీవితం ఏమంత సుఖంగా ఉంటుంది? తక్కువ సామాన్లు వెంట తీసుకెళితే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఈ సత్యాన్ని మన జీవితానికి మాత్రం అన్వయించుకోలేకపోతున్నాం? భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన శాశ్వత ఆనందం రాదు. ఆత్మసాక్షాత్కారంతో మాత్రమే అది సాధ్యం. మరి ఆత్మసాక్షాత్కారం కోసం మనం ఏం చేయాలి?

'నేను' అన్న పదంలోనే 'అహం' దాగివుంది. నేను అంటేనే స్వార్థం. ఇంతకీ నేనెవరినీ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే నా అస్తులు, నా బంధాలు అనే సమాధానాలు వస్తాయి. అంతేనా? నేను అంటేనే నేను మోస్తున్న బరువు అని అర్థం. ఈ బరువు మనల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. మనల్ని మనలా బతకనివ్వదు. పక్షికున్న స్వేచ్ఛ మనిషికుందా? మనను మనం ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. ప్రతి మనిషి నిత్యం జీవనయానం చేస్తూనే ఉంటాడు.

అయితే ఈ బంధాలు, భౌతిక వస్తు లాలసలు అనే భారాలు మనిషి తాను కోరుకునే స్వేచ్ఛా జీవితాన్ని పొందడానికి అవరోధాలుగా మారుతున్నాయి. మనం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి పది మందిలో గుర్తింపు పొందడానికి తహతహలాడుతుంటాం. మంచి స్థితిమంతునిగానో, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించో సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. దీన్నే జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం.

'నేను ఎవరిని' అని మనల్ని మనం ప్రశ్నించుకున్నపుడు సమాజంలో మనకున్న గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలను మాత్రమే పరిగణనలోకి మనం తీసుకుంటాం. మనం మోస్తున్న 'భారం' మన ఉనికిగా మారడానికే ఇష్టపడతాం. తాత్విక దృష్టిలో ఆలోచిస్తే 'నేను ఎవరిని ?' అన్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనను మనం ఆత్మపరిశీలన చేసుకోవలసి వస్తుంది.

నిజంగా 'నేను' నేనుగా, నా కోసమే నేను బతుకుతున్నానా అని ప్రశ్నించుకోవలసి వస్తుంది. "గతం, భవిష్యత్తు అంతా ఈ బంధాలతోనే సాగుతుంది. ఈ బంధనాల్లో చిక్కుకుని, నీలోపలకి నీవు తొంగి చూసుకునేదెప్పుడు? అలా చూడలేనంత కాలం దివ్య జ్ఞానజ్యోతి మనకు గోచరించదు. ఈ 'భారాన్ని' మోస్తున్నంత కాలం నేను నేను కాదన్న వాస్తవం బోధపడుతుంద''ంటారు భగవాన్ రమణమహర్షి.

ఆరాటం వదిలితే ఆత్మజ్ఞానం

ఆత్మజ్ఞానం కలిగిన రోజున నేను ఎవరిని అన్న ప్రశ్నకు నేను అనేది ఒక శూన్యంలా కనిపిస్తుంది. ఇహలోకంలో మోస్తున్న భారాన్ని తొలగించుకుని చూస్తే ఒక ప్రకాశవంతమైన జ్ఞానలోకం గోచరిస్తుంది. నేను అనే అహాన్ని విడనాడిన రోజున మనల్ని మనం నిమిత్తమాత్రులుగా పరిగణించుకుంటాం. మీలోని అహాన్ని తొలగించుకోండి. నిన్న ఏమి సాధించాం అని ప్రశ్నిచుకోండి. రేపు ఏదో సాధించాలనే ఆరాటాన్ని వదులుకోండి. అదే ఆత్మసాక్షాత్కారానికి తొలిమెట్టు.

అయితే, భవబంధాలు అనే భారాన్ని వదిలించుకోవడం అంత సులభమా? చెప్పినంత తేలికగా బంధాలను తెంచుకోగలమా? అయితే భౌతికపరమైన అవసరాలను, వాంఛలను విడనాడి ఆధ్మాత్మిక భావన ఏర్పరుచుకోవడం కష్టమైన కార్యమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. ఒక్కసారి ప్రాపంచిక దృక్కోణాన్ని విడనాడి చూడండి. ఎంతటి స్వేచ్ఛావాయువుల్ని పీల్చగలరో మీకే అర్థమవుతుంది. ఆ భారం వదిలిన మరుక్షణం మీ మనసు దూదిపింజలా మారిపోతుంది. పక్షి లాగే మీ ప్రయాణం తేలికవుతుంది.

మానవ వేదనలకు మూల కారణం ఈ భవబంధాలే అని అర్థం చేసుకోలేక మనిషి ఆ సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్నాడు. మనం మనకోసం బతకాలి. ఇతరులు మన గొప్పతనాన్ని గుర్తించేందుకు బతకాల్సిన పనిలేదు. ఈ అవగాహన వచ్చినప్పుడు ప్రాపంచిక విషయాలు తృణప్రాయంగా మారతాయి. "తనను తాను అర్థం చేసుకోనంతవరకు మనిషి వేదనలను అనుభవిస్తూనే ఉంటాడు. అది అర్థం అయిననాడు మనిషికి సంపూర్ణంగా జ్ఞానోదయం అవుతుంది'' అంటారు ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి.

ధ్యానం అంటే మనసును ఒక లక్ష్యంపై తదేక దృష్టితో గురిపెట్టడం. శరీరం నిశ్చేతనా అవస్థలో ఉన్నప్పటికీ మనసు మాత్రం ఒక అంశంపైనే కేంద్రీకరించడం. మొదట్లో భిన్న ఆలోచనలు ధ్యానయోగాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినపుడే ధ్యానయోగం సిద్ధిస్తుంది. అదే ఆత్మజ్ఞాన సాధనకు సోపానం.

ధ్యానమార్గం ఉత్తమం

ఈ బంధాల భారం తెంచుకోవడం మొదట్లో బాధాకరంగానే ఉంటుంది. గాయం అయినపుడు నొప్పి సహజమే కదా! అది మానుతున్న కొద్దీ నొప్పి కూడా క్రమంగా మటుమాయమవుతుంది. మనిషిలో స్వార్థ చింతన దూరం కానంతవరకు ధ్యానంలో ఏకాగ్రత కూడా సాధ్యపడదు. లక్ష్యంపై గురి కుదరాలే తప్ప దాని వల్ల లభించే ప్రయోజనాల గురించి చింత ఏర్పడినపుడు లక్ష్యఛేదన కూడా సాధ్యపడదు.

ఏదైనా సాధించాలని సంకల్పించినపుడు మన దృష్టి ఆ లక్ష్యంపైనే ఉండాలి. కాని ధ్యాస దారిమళ్లితే లక్ష్యమార్గం కూడా తప్పుకుంటుంది. ధ్యానం అంటే మనసును ఒక లక్ష్యంపై తదేక దృష్టితో గురిపెట్టడం. శరీరం నిశ్చేతనా అవస్థలో ఉన్నప్పటికీ మనసు మాత్రం ఒక అంశంపైనే కేంద్రీకరించడం. మొదట్లో భిన్న ఆలోచనలు ధ్యానయోగాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినపుడే ధ్యానయోగం సిద్ధిస్తుంది.

ఆనందమార్గం

లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు దృష్టంతా లక్ష్యం వైపే ఉండాలి తప్ప దాని వల్ల లభించే ప్రయోజనాలపైన ఉండకూడదు. ఇందుకో చక్కని ఉదాహరణ చెప్పుకుందాం. ఒక గొప్ప విలుకాడు ఏ విధమైన ప్రయోజనాలు ఆశించకుండా బాణం సంధించినపుడు అదే సూటిగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అదే ఒక వెండి నాణాన్ని ఆశించి సంధిస్తే అతని చేతులు వణుకుతాయి. బంగారు నాణెం కోసం సంధించినపుడు అతని కళ్లు బైర్లుకమ్ముతాయి. కంటికి ఏమీ కనపడదు. అతని మెదడు పనిచేయదు.

ఇక్కడ మనం చూడాల్సిందేమిటంటే విలువిద్యలో అతని ప్రావీణ్యం చెక్కుచెదరలేదు. తప్పంతా అతని దృష్టి వచ్చే బహుమానం మీద ఉండడమే. అతను బాణం గురితప్పకుండా కొట్టాలి అని ఆలోచించడం మానివేసి సాధించబోయే బహుమానం గురించి ఆలోచించాడు..అందుకే అది గురి తప్పింది. అందుకే స్వార్థ చింతనకు స్వస్తి చెబితే నిజమైన ఆనందాన్ని పొందగలం. మనం సాధించామనుకుంటున్న విజయాలు అవి భౌతికంగా మన అవసరాలను తీర్చేవే తప్ప మనలోని ఆత్మను సంతృప్తి పరచవని గ్రహించాలి.

ఈ విజయాలు మనలోని అహాన్ని పెంచడంతోపాటు బంధాలను బలపరిచి వాటితో మనల్ని కట్టిపడేస్తాయని తెలుసుకోవాలి. ఏకాగ్రతతో ధ్యానం చేయడం వల్ల ఆత్మసాక్షాత్కారం సాధ్యమవుతుంది. ధ్యానం నిరంతర ప్రక్రియగా సాగాలి. అది సాధించిన నాడు నిన్ను నువ్వు తెలుసుకోగలవు. అప్పుడే ఆనందకరమైన స్వేచ్ఛాయుత జీవితం అనుభవంలోకి వస్తుంది. భారతీయ తాత్త్విక చింతన మొదటి నుంచి చెప్పేది ఇదే. భౌతిక విషయాల వివేచనను వదిలేసి, ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నించాలనేదే ఆది శంకరులు మొదలుకుని, అరవిందుల దాకా అందరూ చెప్పింది. ఆచరించి చూపింది. రండి. మనమూ... ఆత్మవివేచన దిశగా అడుగులు వేద్దాం. అనందమయ జీవితానికి తలుపులు తెరుద్దాం.

Monday, October 31, 2011

సింప్లిసిటీ నగర్ - విశాఖపట్నంలో నెలకొల్పుకున్న 'దయాల్‌నగర్'




అవకాశాలు లేనపుడు సాదాసీదాగా బతకడం వేరు. అవకాశాలు ఉండి కూడా ఒక విశ్వాసంగా, ఒక జీవనసూత్రంగా ఆర్భాటాల్లేని జీవితాన్ని ఎంచుకోవడం వేరు. రెండోదాన్ని మరింత గౌరవిస్తుంది సమాజం. మందూ మాంసాహారం లేకుండా, టీవీ చానెళ్లు లేకుండా, ఉదయం సాయంత్రం ప్రార్థనలతో, పాడీపంటా పాఠశాలా ఆస్పత్రి అన్నిట్నీ తామే నిర్వహించుకుంటూ పాత బంగారంలాంటి ప్రశాంత జీవితాన్ని గడపగలిగిన మనుషులు, ప్రదేశాలు ఇంకా మన మధ్య ఉండడం ఎంత ఆశ్చర్యం! రాధాస్వామి అనుయాయులు విశాఖపట్నంలో నెలకొల్పుకున్న 'దయాల్‌నగర్' అటువంటి ఒక ప్రదేశం.


అనగనగా ఒక కాలనీ.
అక్కడ అందరూ ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు లే చి సామూహికంగా ప్రార్థన చేస్తారు. తర్వాత పిల్లాపెద్దా ఆడామగా అందరూ అరగంటపాటు శారీరక వ్యాయామం చేస్తారు. అటుపై కాలనీలోనే ఉన్న తోటలు, వ్యవసాయక్షేత్రాల్లో పనిచేస్తారు.
వీలయినంతవరకూ తమకు కావాల్సిన ఆకుకూరలు, కాయగూరలను వాళ్లే పండించుకుంటారు. కాలనీని శుభ్రంగా ఉంచుకోవడం, రాత్రిపూట గస్తీ తిరగడం వంటివన్నీ వారే చేసుకుంటారు. ఏ ఇంట్లోనూ కేబుల్ కనెక్షన్ ఉండదు. రాత్రి తొమ్మిదికల్లా నిద్రపోయే ఈ కాలనీవాసుల్లో కులమతాలు, ఆస్తిఅంతస్తుల పట్టింపులుండవు.


సరళం, సామాన్యం

రాధాస్వామి మతస్తులయిన వారు నిరాడంబరతకు పెద్దపీట వేస్తారు. వీరు శాకాహారాన్నీ, అదీ పరిమితంగానే భుజించాలి. మద్యం, ఇతర ఉత్ప్రేరకాలను ముట్టుకోకూడదు. "శాకాహారం తింటే జీవులన్నిటి పట్లా గౌరవం, సహానుభూతి పెరుగుతాయి. ఆహారం కోసం ఇతర జీవులను బాధించాలనే ఆలోచన పోతుంది. మద్యం, ఉత్ప్రేరకాలను వదులుకున్నప్పుడు చేస్తున్న పనిమీద ఏకాగ్రత కుదురుతుంది. ఈ మతదీక్ష తీసుకోవడానికి ఇదీ ప్రధాన నియమం'' అంటున్నారు కేబుల్‌మీడియాలో పనిచేస్తున్న రాజు. "నేనీ మతం తీసుకోకముందు ప్రతిరోజూ మాంసాహారం తినేవాణ్ని. బిజినెస్ పనుల పేరుతో ప్రతిరోజూ మద్యం పార్టీలుండేవి. ఇందులోకి వచ్చాక అన్నీ మానేశాను. దాంతో నాలో వచ్చిన మార్పు నాకే స్పష్టంగా తెలుస్తోంది...'' అన్నారాయన. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ప్రార్థన, పగలంతా తమతమ వృత్తివ్యాపారాల్లో నిమగ్నం కావడం- ఇదే వాళ్ల జీవనశైలి. ఏ పనిలోనైనా రాధాస్వామి మతస్తులు ఆడంబరాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.

పుట్టినపిల్లలకు బారసాల అయినా, ఎదిగినవారికి పెళ్లయినా, అన్నీ కేవలం ఒక ప్రార్థనతోనే సరి. ప్రేయర్‌హాల్లోనో, ఇంటిలోనో ప్రార్థన చేసి వచ్చినవారికి మిఠాయిలు పంచితే ఆ వేడుక అయిపోయినట్టే. దేనికీ పురోహితులు, హోమం, భోజనాలు, ఇతర తంతు - ఏమీ ఉండదు. అలాగే ఏ సందర్భంలోనూ కానుకలు ఇచ్చిపుచ్చుకోవడాలను ఈ మతం ప్రోత్సహించదు. ఎవరైనా చనిపోయినప్పుడు మృతదేహం దగ్గర ప్రార్థన చేసి శ్మశానానికి తీసుకెళ్లి దహనం చెయ్యడమే. మూడో రోజు మరోసారి సామూహిక ప్రార్థన చేస్తారంతే. సంతాపదినాలు, మైల, పదోరోజు భోజనాలు, కర్మకాండల వంటివేమీ ఉండవు. అన్నిటికన్నా ముఖ్యమైన నియమం ఏమంటే సత్సంగులు (రాధాస్వామి మతస్తులు) ఎవ్వరూ మత విస్తరణకు పూనుకోకూడదు.

ప్రచారానికి ఆమడ దూరంలో ఉండాలి. మాటల్లో చెప్పడం ద్వారా కాకుండా ప్రవర్తన ద్వారా తమ విశిష్టతను లోకానికి చాటడమన్నది వాళ్లెంచుకున్న మార్గం. అందువల్ల రాధాస్వామి మార్గం గురించి విరివిగా ప్రవచనాలు, హోరెత్తించే సభలు జరగవు. అయినా దీని గురించి తెలుసుకున్న వేల మంది ప్రతియేటా ఈ మతంలోకి రావడానికి ప్రవేశాన్ని (ఇనిషియేషన్) కోరుతుంటారు. రాధాస్వామి మతానికి సంబంధించిన పుస్తకాలు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ అన్ని భాషల్లోనూ లభిస్తాయి. కులమతాలకు అతీతంగా ఎవరైనా రాధాస్వామి మతంలోకి రావొచ్చు.

ఆగ్రాలో ఆరంభం...

తాజ్‌మహల్ కారణంగా ప్రేమ్‌నగర్‌గా పేరొందిన ఆగ్రా ఆధునిక కాలంలో దయాల్‌బాగ్ వలన కొత్త గుర్తింపును సొంతం చేసుకుంది. నూటయాభయ్యేళ్లకు పూర్వం ఆగ్రాలో పుట్టిపెరిగిన స్వామి శివదయాల్‌సింగ్ 'దేవుడొక్కడే, ఆయన మనందరిలోనూ ఉన్నాడు. మనలో ఉండే ఆ దైవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఒక్కో మెట్టూ ఎదగాలి..' అని బోధించేవారు. తన బోధనలకు ఆకర్షితులైన భక్తులకు ఆ దారిలో నడవడమెలాగో సూచనలిచ్చేవారు. మద్యమాంసాలను వదిలిపెట్టి నిర్మలమైన జీవితాన్ని గడపాలని, రోజుకు రెండు గంటల పాటు శబ్దయోగ ధ్యానంలో గడపాలని ఆయన చెప్పేవారు. ఆయన బోధనలకు కేవలం ఆగ్రావాసులే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు తయారయ్యారు.

'రాధ అనే జీవాత్మను పరమాత్ముడైన స్వామిలో ఐక్యం చేసే మార్గమే మన మతం' అని ప్రకటించిన ఆయన సూచనను అనుసరించి రాధాస్వామి సత్సంగ్ ఆగ్రాలో 1861లో ప్రారంభమయింది. స్వామి నిర్యాణానంతరం ఆయన భార్య రాధ అక్కడే ఉండి రాధాస్వామి మతాన్ని కొనసాగించారు. సత్సంగ్ కేంద్రం ఇప్పటికీ ఆగ్రానే. స్వామి శివదయాల్‌సింగ్ తమ్ముడు ప్రతాప్‌సింగ్, భక్తులు షణ్ముఖదాస్, గరీబ్‌దాస్, బాబా జైమల్‌సింగ్‌లు మాత్రం వివిధ ప్రాంతాల్లో నివాసం ఏర్పర్చుకుని రాధాస్వామి మత వ్యాప్తికి కృషి చేశారు. దాంతో హర్యానాలోని దినోద్, రాజస్థాన్‌లోని గంగానగర్, పంజాబ్‌లోని బియాస్, తరణ్‌తారణ్‌లో వీటిలో ముఖ్య కేంద్రాలున్నాయి. వీరిలో బాబా జైమల్‌సింగ్ అవిభాజ్య పంజాబ్‌లో బియాస్ నది ఒడ్డున ప్రారంభించిన సత్సంగ్ ఎక్కువ పేరు గడించింది. కొద్దిపాటి తేడాలతో అన్ని మార్గాల రాధాస్వామి మతస్తులు నమ్మే తత్వం ఒక్కటే.

ఇదీ తత్వం...

కులమతాలకు అతీతంగా సృష్టిలో జననమరణ వలయం ఒకటి ఉంటుందని నమ్మేవారంతా దానినుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. "పరమాత్మను చేరుకునే మార్గం చూపడానికి గురువు అవసరం. గురు సూచనలకు అనుగుణంగా ప్రార్థన చేసినప్పుడు వ్యక్తులు తమలోని దైవత్వాన్ని అనుభూతి చెందగలరు. దానికోసమే సత్సంగం...'' అనేది రాధాస్వామి మతస్తుల నమ్మకం. దానికోసమే ప్రతిరోజూ ప్రభాతవేళ నాలుగు నుంచి ఐదు వరకూ, మళ్లీ ప్రదోషవేళ (సాయంత్రాలు) సామూహిక సత్సంగ్ (ప్రార్థనలు) నిర్వహిస్తారు. ప్రార్థన జరిగే చోట ఎలాంటి ఆడంబరాలు, క్రతువులు ఉండవు. కేవలం పూర్వ గురువులు చెప్పిన శబ్దాలు (పాటల వంటివి) సామూహికంగా గానం చేస్తారు.

ప్రార్థనామందిరంలో వేలమంది ఉన్నా చీమచిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం ఉంటుంది. శబ్దాలను గానం చేసిన తర్వాత గురు ప్రసాదంగా మరమరాలను స్వీకరిస్తారు. రాధాస్వామి మతం ఏ బంధాన్నీ వదులుకొమ్మని చెప్పదు. కుటుంబం, సమాజం, స్నేహితులు, బంధువులు.... అందరి పట్లా తమ బాధ్యతలను నిర్వర్తించమని, అనురాగాలను పెంచుకోమనే చెబుతుంది. గృహస్థ ధర్మానికి మద్దతుగా నిలబడుతుంది. పరమాత్మ కోసమంటూ అన్నిటినీ పరిత్యజించడాన్ని, ఏ పనీ చెయ్యకుండా మరొకరి మీద ఆధారపడి గడిపే జీవనశైలినీ ప్రోత్సహించదు. అయితే 'దేన్నీ ఉచితంగా ఇవ్వొద్దు, అలాగే ఉచితంగా తీసుకోవద్ద'ని చెబుతుంది.

అందరూ పాటించాల్సిందేనా..?

మరి వచ్చే కోడళ్లు, పుట్టే పిల్లల సంగతేంటి? వాళ్లు కూడా అవే నియమాలు పాటించాలంటే కష్టం కదా అనుకుంటారేమో. కుటుంబంలో ఒకరు ఆ మతస్తులైనంత మాత్రాన.. కుటుంబమంతా దాన్ని అనుసరించాలన్న నియమం ఏమీ లేదు. ఉదాహరణకు దయాల్‌నగర్‌లో ఉండే శాంతిస్వరూప్ విషయం తీసుకుందాం. "మా తల్లిదండ్రులు రాధాస్వామి మతస్తులు. చిన్నప్పటి నుంచి నాకు ఈ పద్ధతులతో పరిచయం ఉంది. నేను సత్సంగీనయ్యాను.

కాని నా భార్య కాలేదు. ఆమె తప్పనిసరిగా కావాలనే నియమం ఏమీ లేదు. అయితే ఇంట్లో వేరే మతపూజ, ప్రార్థనలు చెయ్యకూడదనే నియమం ఉంది. అందువల్ల ఆమె పూజాపటాలు, సామగ్రిని ఆమె తల్లిగారి ఇంట్లోనే వదిలేసి వచ్చింది. మా అబ్బాయికి పన్నెండేళ్లు. తను కాస్త పెద్దయ్యాక తనకు ఏ మతం కావాలంటే ఆ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ అతనికి ఉంది..'' అంటూ చెప్పుకొచ్చారు శాంతిస్వరూప్. అలాగే ఇక్కడ కులమత పట్టింపులు కూడా ఉండవు. కాలనీ హౌసింగ్ సొసైటీకి అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న స్వరూప్ భార్య, కోడలు, అల్లుళ్లది తలా ఒక కులం. అందరి మత విశ్వాసాలు కూడా ఒక్కటి కాదు. "మేమిద్దరం సత్సంగీలమే. అయితే మా అల్లుడు, కోడలు రాధాస్వామి మతస్తులు కాదు. వాళ్లు ప్రార్థనను బయట చేసుకుంటారు. దానివల్ల ఇంట్లో ఏమీ తేడా రాదు..'' అన్నారు స్వరూప్.

సొమ్ములు వద్దండి...

ప్రతి చిన్న విషయమూ డబ్బుతో ముడిపడిన నేటిరోజుల్లో ఆశ్చర్యంగా అనిపించే విషయమేమంటే - నూటయాభె ౖఏళ్ల రాధాస్వామి సత్సంగ చరిత్రలో తొలి గురువు నుంచి నేటి గురువు వరకూ అందరూ వారివారి వ్యక్తిగత సంపాదన మీదే జీవించడం. తమ భుక్తి గడవటం కోసం, అవసరాల కోసం వారు ఎవ్వరిదగ్గరి నుంచీ విరాళాలు స్వీకరించరు. మరోలా చెప్పుకోవాలంటే భక్తుల సొమ్ము మీద బతికే బాబాలు కాదు వారు. పైగా సంస్థ చేసే మంచి పనులకు తమ జేబులో నుంచే సొమ్మునివ్వడం గమనార్హం. అసలు సత్సంగ్ సొసైటీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరించే తీరే మిగిలిన ధార్మిక సంస్థలకు భిన్నంగా ఉంటుంది.

రాధాస్వామి సత్సంగ్‌లో ఇనిషియేషన్ (మౌలిక సభ్యత్వం) లేనివారి నుంచి అసలు ఎలాంటి విరాళమూ స్వీకరించరు. సభ్యుల నుంచి స్వీకరించేది కూడా మనిషికి ఏడాదికి రెండు రూపాయలు, గరిష్టంగా రెండొందల రూపాయలు. సత్సంగ్ భవనాల నిర్మాణాల కోసం ఇవ్వాలనుకుంటే గరిష్టంగా రెండువేల రూపాయలు. ఎంతటి స్తోమత ఉన్నవారైనా అంతకు మించి ఇవ్వడానికి వీల్లేదు. "ఇన్ని రకాల బాబాలు, స్వామీజీలు, సంస్థల గురించి విని ఉంటారు కదా మీరు. ఎవ్వరైనా చందాలొద్దు, దక్షిణలొద్దు అనడం విన్నారా? ఒక్క దయాల్‌బాగ్ సంస్థలు, కాలనీల్లోనే మీకు డబ్బు ప్రసక్తి ఉండదు. అందుకే మా గురువుల గురించిగానీ, మా సంస్థ గురించిగానీ ఎప్పుడూ చెడు వార్తలు రావు..'' అని సగర్వంగా చెప్పారు లక్ష్మి అనే గృహిణి.

విలువలతో కూడిన విద్య

ఇవాళ కాలనీలలో, గేటెడ్ కమ్యూనిటీలలో నిర్మాణం మొదలుపెట్టగానే షాపింగ్ కాంప్లెక్సులకూ, మల్టీప్లెక్సులకూ స్థలాన్ని కేటాయించడం మనం చూస్తున్నాం. కానీ ఆగ్రాలో దయాల్‌బాగ్ కాలనీకి శ్రీకారం చుట్టిన మర్నాడే అక్కడివారు ముందుగా పాఠశాల నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అలా కోఎడ్యుకేషన్ మిడిల్ స్కూల్‌గా 1917 జనవరి 1న ప్రారంభమైన దయాల్‌బాగ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ విద్యాసంస్థ 1981కల్లా డీమ్‌డ్ యూనివర్సిటీగా ఎదిగింది. మన దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. డీఈఐకి చెందిన సుమారు ఎనభై దూరవిద్యాకేంద్రాల్లో విశాఖపట్నం దయాల్‌నగర్ ఒకటి. ఇక్కడ పేద విద్యార్థులు తమ కాళ్లమీద తాము నిలబడేందుకు అవసరమైన వృత్తివిద్యల్లో శిక్షణనిస్తారు. చదువు పూర్తయ్యాక వారు ఉద్యోగాల్లో కుదురుకునేందుకు సైతం దయాల్‌నగర్ డీఈఐ సహకరిస్తుంది.

1915 జనవరి 20న వసంతపంచమి రోజు ఒక మల్బరీ మొక్కను నాటి ఆగ్రా దయాల్‌బాగ్ కాలనీకి శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు ఇసుకపర్రలుగా ఉన్న స్థలం వేలమంది సత్సంగుల శ్రమదానంతో కాలం గడిచిన కొద్దీ అందమైన, ఆహ్లాదకరమైన దయాల్‌బాగ్‌గా రూపుదిద్దుకుంది. 1200 ఎకరాల వ్యవసాయక్షేత్రం, అందులోని పంట- అన్నీ వారి కృషి ఫలితమే. నివాస కాలనీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, భూములు, పాడి అన్నీ ఉన్నాయి. దేనికీ బయట ప్రపంచం మీద ఆధారపడే అవసరం లేదు. ఆగ్రా దయాల్‌బాగ్ సత్సంగ్ సొసైటీకి మన దేశంలో సుమారు ఐదు వందల కేంద్రాలుండగా, అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, సింగపూర్, దుబాయ్, శ్రీలంక, నేపాల్ వంటివి దేశాల్లోనూ దానికి శాఖలున్నాయి.

కాలనీలు కావాలంటే....

విశాఖలోనే కాదు, రాష్ట్రంలోని చాలా ప్రాం తాల్లో - ఆమాటకొస్తే దేశంలో పలుచోట్ల రాధాస్వామి మతస్తులు ప్రత్యేక కాలనీలుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడుతున్నారు కూడా. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్‌లోని రూర్కీ, తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని మేలతిరువేంకటనాథపురమ్, ముంబైలోని పన్వెల్, ఢిల్లీలోని స్వామినగర్, సికింద్రాబాద్‌లో వెస్ట్‌మారేడుపల్లి, విశాఖపట్నం పేరుపొందినవి. ఈమధ్యనే రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం వంటి చోట్ల కాలనీలు ఏర్పడ్డాయి. కాలనీల ఏర్పాటుకు రాధాస్వామి సత్సంగ్ సొసైటీ కొన్ని నియమనిబంధనలను విధిస్తుంది. అందులో ముఖ్యమైనది - ఆ ప్రాంతంలో తమ మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు తగిన వాతావరణ ం ఉండాలి.

వ్యక్తులు దానికి తగిన క్రమశిక్షణతో మెలగాలి. సభ్యులందరికీ సేవా దృక్పథం ఉండాలి. 2005 మార్చి తర్వాత ఏర్పడిన కొత్త నిబంధనల ప్రకా రం - కొత్త కాలనీల్లో ఎవరికీ ప్రైవేటు ఆస్తులుండవు. అక్కడి భూమి, నిర్మించిన ఇళ్లు అన్నీ రాధాస్వామి సత్సం గ్ సభకో లేదా అక్కడి స్థానిక సత్సంగి సొసైటీకో చెందుతాయి. కాలనీ నిర్మాణానికి అప్పుగానో, డిపాజిట్‌గానో సత్సంగులు ఒక్కొక్కరు లక్ష రూపాయల వరకూ ఇవ్వొచ్చు. దాన్ని కాలనీ ఐదేళ్లలోగా తిరిగిచ్చేస్తుం ది. లక్ష కన్నా ఎక్కువ ఇవ్వగలిగినా సరే, స్థానిక సొసైటీ దాన్ని స్వీకరించదు. ఈ కొత్త నిబంధనలతో మన రాష్ట్రంలో కడప, బొల్లారంలలో కాలనీలు ఏర్పాటయ్యాయి. కాన్పూర్ దగ్గర అమృతపురం, పంజాబ్‌లోని మల్లంపూర్ దగ్గర కూడా ఏర్పాటు కాబోతున్నాయి.

పనిలోనే దైవం

తామంతా కలిసి ఒక సమాజంగా ఉండటమంటే ఇతరులకు దూరంగా ఉండటం కాదని సత్సంగీల నమ్మిక. అందువల్లనే వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లోతాము నడిపే పాఠశాలలు, డిస్పెన్సరీలు వంటి వాటిలోకి అందరికీ ప్రవేశం కల్పిస్తారు. అలాగే దైనందిన జీవితంలో అవసరమైన కొన్ని వస్తువులను సత్సంగీలే స్వయంగా తయారుచేసి, తోటివారికి ఉత్పత్తి ధరకే అందిస్తారు. ఉత్పత్తి నైపుణ్యాలను పెంచుకోవడం, సహకారపద్ధతిలో పనిచెయ్యడం, వ్యయం పెరగకుండా చూసుకోవడం వంటివి వారి లక్ష్యాలు.

దేశంలో దాదాపు ముప్ఫై ప్రాంతాల్లో కొవ్వొత్తుల తయారీ, పిల్లల దుస్తుల తయారీ, వస్త్రాల తయారీ వంటివాటిని కుటీర పరిశ్రమలుగా సత్సంగీలు నిర్వహిస్తున్నారు. ఆగ్రా దయాల్‌బాగ్ నుంచి విశాఖ దయాల్‌నగర్ వరకూ అన్నిచోట్లా ఇదే తత్వాన్ని అనుసరిస్తున్నారు. వీరి జీవనశైలి గురించి- మొదటిసారి విన్నప్పుడు 'చక్కగా ఉంది. మనమూ చేరితే బావుండు' అని చాలామందికి అనిపిస్తుంది. అయితే, ఆ జీవన విధానాన్ని పాటించడం అంత సులువు కాదు. ముఖ్యంగా టీవీ, కేబుల్ లేకుండా ఉండటం, మందు, మాంసాహారాన్ని మానడం ఎక్కువమందికి ఇష్టం ఉండదు.

అమ్మడం, కొనడం ఈజీ కాదు

"అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇహనేం, ఈ కాలనీలో ఓ ఇల్లు కొనేసుకుంటే సరి. ప్రశాంతమైన జీవనశైలిని ఎంజాయ్ చెయ్యొచ్చు..'' అనుకుంటున్నారా? మీరేకాదు, దయాల్‌నగర్ కాలనీ గురించి విన్నప్పుడు, దానిని చూసినప్పుడు ఎవరికైనా ఇలా అనిపించకమానదు. అయితే అదంత సులువు కాదు. రాధాస్వామి మతస్తులకు తప్ప వేరే వారికి ఇళ్లు అమ్మడం ఇక్కడ నిషిద్ధం. సహకార పద్ధతిలో ఏర్పడిన అక్కడి హౌసింగ్ సొసైటీ ఇళ్లు అమ్మదలచుకున్న సత్సంగీలది ఒకటి, కొనదలచుకున్న సత్సంగీలదొకటి జాబితా సిద్ధంగా ఉంచుకుంటుంది.

ఏదైనా అమ్మకానికి వచ్చినప్పుడు నిరీక్షణ జాబితాలో ఉన్నవారికి తెలియజేస్తే వారు కొనుగోలు చేయవచ్చు. అది కూడా మార్కెట్ రేట్లకు కానేకాదు. ఉదాహరణకు దయాల్‌నగర్ ప్రాంతమంతా ఇప్పుడు గజం ముప్ఫైఐదువేల రూపాయలు పలుకుతుంటే సత్సంగుల మధ్య అమ్మకాలు గజం పద్నాలుగు వేల రూపాయలు (ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధరకు) లెక్కనే జరుగుతాయి. ఇక్కడుండాలంటే మీరు ఆ మతాన్ని, వారి క్రమశిక్షణనూ పాటించాల్సిందే.

నేటి గురువు డాక్టర్ ప్రేమ్‌శరణ్ సత్సంగి...

ఒక గురువు నిర్యాణం పొందితే తర్వాతి గురువును ఎంపిక చేసే పని మొదలవుతుంది. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, ప్రక్రియ సజావుగా సాగడానికి రాధాస్వామి సత్సంగ్ సభకు ఒక పద్ధతి ఉంది. ఇదొక రిజిస్టర్డ్ సొసైటీ. పూర్వ గురువు ప్రస్తావించిన వ్యక్తినే తర్వాతి హుజూర్‌గా ఎంపిక చేస్తారు. అలా ఏ పేరూ ప్రస్తావనకు రానప్పుడు ఎక్కువమంది సత్సంగీలకు అంగీకారమయిన వ్యక్తి గురుపీఠాన్ని అధిరోహిస్తారు. 2003 మేలో పరమగురు డాక్టర్ లాల్‌సాహెబ్ తర్వాత ఎవరన్న ప్రశ్న తలెత్తినప్పుడు దేశం నలుమూలల నుంచి వచ్చిన 25000 మంది సత్సంగీలు ఏకగ్రీవంగా ప్రేమ్‌శరణ్‌ను గురుస్థానానికి ప్రతిపాదించారు. అలా గురువుల పరంపరలో ఎనిమిదో వారిగా ఎన్నికైన హుజూర్ డాక్టర్ సత్సంగి సాహెబ్. ఈయన పేరు ప్రేమ్‌శరణ్ సత్సంగి. ఢిల్లీ ఐఐటీకి అకడమిక్ డీన్‌గా పనిచేసి రిటైరయ్యారు. మే 2003నుంచి గురు స్థానంలో ఉండి భక్తసమాజాన్ని నడిపిస్తున్నారు.

పండగలూపబ్బాలూ

రాధాస్వామి సత్సంగం ప్రారంభమయిన వసంత పంచమి రోజున ఆ మతస్తులు తమ ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. ఇంటిముందు దీపాలు వెలిగించి, కాలనీలను తీర్చిదిద్దుకుంటారు. దీపావళి రోజు టపాసులను కాల్చడం సొమ్మును వృధా చేయడమేనని వీరి నమ్మకం. దానికి బదులు దీపావళిని 'చ్రిల్డన్స్ డే'గా, 'పర్యావరణ దినోత్సవం'గా జరుపుకుంటారు. పర్యావరణప్రియ అంశాల మీద పిల్లలకు పోటీలు నిర్వహించడం, ఆరోజు వారితో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి బహుమతులివ్వడంలో కాలనీవాసులంతా బిజీగా ఉంటారు.

అలాగే మహిళా సొసైటీ ఆరోజు పానీపురీ, హాట్‌చాట్, మంచూరియా వంటివి తయారుచేసి ప్లేటు ఐదు రూపాయలు, మూడు రూపాయల ధరలకు అందుబాటులో ఉంచుతుంది. పోటీలు, ప్రదర్శనలూ ముగిసిన తర్వాత కాలనీవాసులంతా వాటిని ఆనందంగా ఆరగించి ఇంటిదారి పడతారు. ఇదిగాక ఏడాదిలో ఐదారుసార్లు 'భండారా' అనే పర్వదినాన్ని నిర్వహించుకుంటారు దయాల్‌బాగ్ వాసులు. ప్రత్యేక ప్రార్థనలు, గురువుగారితో పాటు 'ప్రీతిభోజన్' ఆ రోజు ప్రత్యేకతలు. హోలీని కూడా బాగా చేసుకుంటారుగానీ, రంగులు జల్లుకోవడం వంటి అట్టహాసాలేమీ ఉండవు.


* అరుణ పప్పు

Saturday, October 8, 2011

'దళిత అలలు' - కంకర చంద్రయ్య

నా పేరు కంకర చంద్రయ్య

 
















నేను కంకర చంద్రయ్యను. నల్గొండ జిల్లా, బీబీనగర్ దగ్గర్లోని ఎంకిర్యాల మా ఊరు. అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. అన్నాతమ్ముడు అక్క చెల్లెలు ఎవ్వర్లేరు. ఒంటరిని. ఊళ్లో ఎవరైనా అన్నం పెడుతుంటే వాల్లకు ఏవైనా పనులు చేసి పెట్టేవాన్ని. ఓ ఏడాది బర్రెలు కాశాను. ఓ ఏడాది ఆవులు కాశాను.

ఇంతలో నా పేరుగల్లోడే... చంద్రయ్యని వొచ్చిండు. వచ్చి 'నాల్గురూపాయల జీతంకి ఆవులకాడ కొలువున్నావూ కదా... ఏడు రూపాయలిస్తా నా దగ్గరికి రా' అన్నాడు. ఆశ గొప్పది. అప్పట్లో ఏడు రూపాయలంటే చాలా పెద్దమాట. ఆలోచించా. హైదరాబాదుకు బయలు దేరా. అప్పటికే పెళ్లయింది నాకు. అయినా ఒంటరిగా ప్రయాణం మొదలెట్టా.

కొడితే కొండలు పిండే...
నవాబు బహదూర్ యార్జెంగ్ బొంద రాయి కొట్టడంతో నా పని ఆరంభమయింది. ఆయనో ముస్లిం నవాబు. బహదూర్ యార్జెంగ్‌ను ముసిరాబాద్ జైల్లో బొంద పెట్టారు. నెమ్మదిగా రాయిపని నేర్చాను. చానా ఫాస్ట్‌గా.. ఫాస్ట్ అంటే...చానా ఫాస్ట్. చిన్నతనంలో నా కెవ్వరూ ఎదుర్రాకపోదురు. కొండలు పిండవ్వాల్సిందే. అది చూసి కొందరేమన్నారంటే 'భీముని గడియల్లో నువ్ సుత్తెపట్టుకున్నవ్..అందుకే ఇంత ఫాస్ట్ వున్నావ్' అంటూ పొగిడిటోళ్లు. తతిమాల్లు నాల్గు దెబ్బలు గొడితె పగలాలి.

నాకు ఒక్క దెబ్బలోపలే పగిలిపోవాలె. అట్లా కొన్ని రోజులు చేశాను. ఆడికెల్లి - ఈ ఇమాయత్‌సాగర్ రాయి గొట్టడానికి పోయిండ్రు. నేను కూడ వాళ్ళెమ్మట వెళ్లాను. మా గురువు సామేలు, అబ్రాం, పేతురు.. వాల్లంతా నా సన్నిహితునుకో. మేమంతా కలిసి పని చేసేవాళ్లం. ఎక్కడ పని ఉందంటే అక్కడికి పోవాల్సిందే.

సబ్ కాంట్రాక్టర్‌గా మొదలై...
దోస్తులతో కలిసి తిరగని చోటు లేదు. కొట్టని రాయి లేదు. రాయిచూరు, అల్లెల్లి, చిద్ధినూరు, బాస్వాడ పోయినం. ఆడ కొన్ని రోజుల్జేసిన. ఆడికెల్లి బోదన్ బోయిన. ఆడ కొన్ని రోజుల్జేసిన బోదన్ల రాయి గొట్టమంటే 'ఇయ్యాలొక్కటే దినం రేపు లేద'న్నాడు, నేను రాత్రింబవల్లు గొట్టి... ఓ నలభై కడియల్ దీసి రెండున్నరకొక కడియలెక్క వంద రూపాయల్దీసుకున్న. వందరూపాయలిచ్చి ఒక తిత్తి, ఒక సుత్తె ఒక గన్ను, ఒక గడ్డపార, ఒక ఇరవై మొలలు తీసుకొని ఆడ పని సురుజేసిన.

నేను బంజారిల్ పోయినం. గడ్డి దానయ్యని ఒక కాంట్రాక్టరుండే.ఆయనతాన సబ్‌కాంట్రాక్టరు నేను కూడా వొడ్డెరోల్లబెట్టి పన్జేయించాలని అమ్మలక్కలందరూ సుద్ధల్ధీసిచ్చారు. అవన్ని కుదవబెట్టి, కొన్ని పైసల్ దీసుకొని, వచ్చి ఆడబెట్టాను. అక్కడ పన్జేసి ఒక ఏడెనెమిదొందలు సంపాదించిన. నయాపూల్‌లో ఓ కాంట్రాక్టర్ -' కంకర చంద్రయ్య అంటే ఎవరు' అని వచ్చిండు. ఎందుకొచ్చినవంటె, 'కంకర గావాలె' అన్నడు. ఓహో.. నాకు గుర్తింపొచ్చింది. ఆ క్షణానే కంకర చంద్రయ్య అయిపోయా.

రాళ్ల దెబ్బల నుంచి 'రాకింగ్' జననం...
హైద్రాబాద్‌లో ఒక వెస్టన్‌స్టార్ కొత్తసైకిల్ - నూటయాభై రూపాలకి దీసుకున్న. కోటీ దగ్గర ఒక సింగోడు హోటలుండేది. పావలాకు నాలుగు పూరీలు. ఏకానిస్తే ఒక్కపూరీ, ఒక్క పూరీ తిని పన్జేసేది. మల్లా ఆకలేస్తే వచ్చి మల్లా ఏకానిచ్చి మల్లా తినేది. అంటే పావలిచ్చే పరిస్థితి కూడ లేదు. ఆ సైకిల్ మీదినే తిరుక్కుంట మాల్ అమ్మేది. అలా సొమ్ము పోగేసిన. రెండువేలెనకేసిన. లారీ ఒకటి కొన్నా. ఇక దాన్తోని పని... అది పోతా పోతనే పడి పోయేది. చాల కష్టపెట్టింది.

అయినా లాభమిచ్చింది. ఇట్ల ఒక లారీ అయింది. తరువాత రెండు, మూడు, నాలుగు... అలా పెరిగి పది లారీలయినాయి. హైదరాబాదుకు తొలి క్రషింగ్ మెషీన్ నేను తెచ్చా. ఇస్టోన్ క్రషర్, ఆరొందల మంది వడ్రోల్లు, ఇద్దరు క్రష్‌ర్ డ్రైవర్లు. ఆర్గురు హెల్పర్లు. ఓ... ఇక కంకరంటే మోగిపోయింది. డబ్బు బాగొచ్చింది. అప్పటికే నా దగ్గర ఏడెనిమిది లక్షలరూపాయ లున్నాయి. నేను చేస్తున్న కాంట్రాక్టు వేరే వాళ్లకు రెండు లక్షలకు అమ్మేసినా. ఏదైనా కొత్తగా చేద్దామనుకున్నా. అప్పుడే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఆక్షన్ అని తెలిసింది.

గుజరాతీలెవరో గెలిచారట. ఆక్షన్ అయిపోయింది. గెలిచినోడి దగ్గరకు పోయా. భూమి కావాలన్నా. ఎంత ఇస్తావన్నాడు. వందకు మరో రెండున్నర రూపాయలు కలిపిన. చల్ తీసుకో అన్నాడు. ఆరువేలు కట్టి సంధ్య 75 ఎం ఎం థియేటర్ స్థలం కొన్నా. సంవత్సరం తిరిగేసరికి థియేటర్ కట్టేసినా.

నిర్మాణ రంగంలోనూ...


సంధ్య థియేటర్ పూర్తయ్యాక ఒక్కో సినిమా హాలు కట్టుకుంటూ పోయా. కాలం మారింది. కంకర చంద్రయ్య ఎనిమిది థియేటర్లు ఓనరు మరి. ఇంతలో ఓసారి అక్కినేని నాగేశ్వరరావుతో 'ఏడంతస్థుల మేడ' అనే సినిమా తీశా. ఒక్క సినిమా నిర్మాతనయ్యా. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి బిజీ అయిపోయా. హైదరాబాదు, సికింద్రాబాదుల్లో వందల ఫ్లాట్లను కట్టించాను.

ఆదుకోమని వచ్చేవాళ్లకి సాయం చేశాను. కొన్నాళ్ల క్రితం మా పిల్లలేదో గడబిడ జేసి (సంధ్య థియేటర్స్ ఉన్న స్థలం)అమ్మమన్నారు. అమ్మితే రెండు వందల ఇరవైకోట్లు వస్తాయన్నారు. వెయ్యి కోట్లిచ్చినా నేనియ్యనయ్యా . నా హార్ట్ ఇది. ఇలాంటి ఆఫర్లు ఎన్నో చూశా. జీవితంలో కష్టపడ్డా. ఫలితమొచ్చింది.

( లెల్లె సురేష్ నిర్మించిన 'దళిత అలలు' డాక్యుమెంటరీ నుంచి)


Wednesday, July 6, 2011

ఫా ....... రెస్ట్

ప్లేట్‌లో ఇంత కంకర, సిమెంట్, ఇసుక కలుపుకుని తిని లేస్తున్నట్లు తయారయింది మనిషి జీవితం!
నెమ్మది లేదు, నిమ్మళం లేదు, ప్రశాంతత లేదు.
పచ్చదనం లేదు, పరామర్శలేదు, బతుకుబాటలో ఒకటే పరుగు.
వాహనాల మధ్య పరుగు, పెట్రోల్ తాగినట్లు పరుగు!
‘ఇది కాదు జీవితం’ అనుకున్నాడు విజయకుమార్.
ఇల్లు వాకిలి వదిలి, భార్యాపిల్లల్ని వదిలి...కొన్నాళ్లు అడవిలోకి వెళ్లిపోయాడు!
‘మనిషి’గా తిరిగొచ్చాడు.

ఏమిటీ మనిషి?
మనిషి కావడం ఏమిటి?


ప్రకృతిలో సహజసిద్ధంగా ఉండేది ఏదైనా మనసును అల్లుకుపోతుంది. అనుభూతింపజేస్తుంది. దానిని పోలి ఉండే రూపాలు మనం ఎన్ని సృష్టించుకున్నా చిట్టి చిగురు ముందు అవన్నీ చిన్నబోయేవే. ఎటు చూసినా కాంక్రీట్ వనాలు.. రణగొణధ్వనులు... మనల్ని మన నుంచే దూరం చేసే ఈ చికాకులను తప్పించుకుంటూ, స్వచ్ఛమైన అనుభూతిని వెతుక్కుంటూ మనతో మనం ఉండేచోటుకి వెళ్లిపోతే- ఈ ఆలోచన చాలా మందికి చాలాసార్లు వచ్చుంటుంది. కాని ఆచరణలోకి తెచ్చే ధైర్యం మాత్రం ఒక్క విజయ్‌కుమార్ లాంటి వాళ్లకు మాత్రమే ఉంటుంది.‘ఆ ఆలోచనే నన్ను అడవి బాట పట్టించింది’ అని చెప్పారుమెదక్‌జిల్లా పెద్దశంకరం పేట మండలానికి చెందిన విజయ్‌కుమార్ (35).

సెలవులు వస్తే ఎవరమైనా ఏమాలోచిస్తాం? ఊళ్లో ఉన్న బంధువుల ఇళ్లకో, స్నేహితులను కలవడానికో లేదా సకుటుంబ సపరివారంగా ఏ విహారయాత్రకో ప్లాన్ చేస్తాం. వీటికి భిన్నంగా విజయ్ వేసవి సెలవులను అడవిలో గడపాలనుకున్నారు. అదీ ఒంటరిగా. ఎందుకలా? అని ప్రశ్నించేవాళ్లకి తన వన విహారం గురించి ఆయన వివరిస్తుంటే ఒక్కసారైనా అడవితల్లి పొత్తిళ్లలో సేదతీరాలి అన్న తలంపు కలగకమానదు. తొమ్మిదేళ్ల్లుగా ఉపాధ్యాయవృత్తిలో కొనసాగుతున్న విజయ్‌కుమార్ మొన్నటి వేసవి సెలవుల్లో (మే 6 నుంచి మే 27 వరకు) అరణ్యవాసం చేయడం ద్వారా సమ్‌థింగ్ స్పెషల్ అయ్యారు. తనను తానే తోడుగా తీసుకుని పంచవటి అరణ్యానికి వెళ్లి, వచ్చిన విజయ్‌కుమార్‌తో ముచ్చటించినపుడు... ఎంతో ఉత్సాహంగా తన వనవాసపు విశేషాలను చెప్పారు.


అరణ్యవాసం ఆలోచనకు నేపథ్యం...

‘మూడేళ్ల క్రితం స్నేహితునితో కలిసి శ్రీశైలం, అక్కడ భీముని కొండకు కాలినడకన వెళ్లాను. ఆ తర్వాత తిరుపతి ఆయుర్వేద ఔషధవనంలో తిరిగాను. అప్పుడు వన సౌందర్యం గురించిన కవుల వర్ణనలు కళ్లకు కట్టాయి. అలాగే మా ఊరికి ముప్పైకిలోమీటర్ల దూరంలో పంచవటి (పంచగ్రామ అని కూడా అంటారు) అనే పేరున్న ఒక అటవీ ప్రాంతం ఉంది. ఆ అడవిలో ఉన్న శనీశ్వరాలయానికి వెళ్లినప్పుడు ఆ పరిసర ప్రాంతాలను చూశాక... అనిపించింది ఇంతటి అద్భుతమైన ప్రపంచాన్ని వదిలి దేనికోసం పరుగులు పెడుతున్నాను? అని. అప్పటి నుంచే మనసులో ఓ ఆలోచన... ‘కొన్నిరోజులైనా వన సౌందర్యాన్ని ఒంటరిగా ఆస్వాదించాలని. అందుకు ఈ వేసవి సెలవులు కలిసివచ్చాయి’ అంటూ అడవికి వెళ్లడానికి, అక్కడ ఉండాలన్న ఆలోచన నేపథ్యాన్ని వివరించారు. ఈ విషయం చెప్పగానే తల్లి, తండ్రి, భార్య మిగతా కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆయన్ను ఆపాలని చూశారు. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు. అయితే అప్పటికే అడవి అంటే విపరీతమైన ఇష్టాన్ని నింపుకున్న విజయ్‌కుమార్ అవేవీ పట్టించుకోలేదు. తను అనుకున్నట్టుగా ప్రయాణానికి సిద్ధమయ్యారు. ‘నా పిల్లలు చిన్నవాళ్లు. ఉదయం వెళితే సాయంత్రానికే ఎప్పుడెప్పుడు వారిని చూస్తానా అని ఎదురుచూసే నాకు వాళ్లను వదిలి ఉండటం ఒకింత కష్టమే అనిపించినా ప్రకృతిమాతతో కలిసి ఉండాలనే ఇష్టం ముందు అన్నీ తలవంచాయి’ అన్నారు.

ఒంటరిగా... ప్రకృతి ఒడిలో...
పదికేజీల బియ్యం, రెండు కేజీల పప్పు, కొద్దిగా ఉప్పు, కారం, రాగిపిండి, రెండు గిన్నెలు, రెండు పంచెలు, ఒక తువ్వాలు, దేవీభాగవతం... వీటితోనే పంచవటికి పయనమయ్యారు విజయ్. వేకువజామునే బయల్దేరడంతో త్వరగానే ప్రకృతి ఒడిలోకి చేరుకోగలిగారు. ముందుగా శనీశ్వరాలయానికి వెళ్లి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జనజీవనానికి సంపూర్ణంగా దూరమయ్యాననుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. ‘ఆలయ పూజారికి నా విషయం చెప్పినప్పుడు అతను చూసిన వింత చూపు ఇప్పటికీ గుర్తొస్తుంటుంది’ అంటూ నవ్వేసిన విజయ్ అడవి అనుభవాలను ఇలా వివరించారు...

‘‘ఆలయప్రాంగణంలో నా బ్యాగు ఉంచి చెరువు దగ్గరకు వెళ్లాను. చెరువులో స్నానం చేసేసరికి ఏదో మోయలేనంత భారం ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది. ప్యాంట్, షర్ట్ నుంచి పంచె, తువ్వాలులోకి మారి... శనీశ్వరునికి దణ్ణం పెట్టుకొని పొయ్యి రాళ్లు సెట్ చేసి, కట్టెలు పోగేసాను. అంబలి కాచుకొని తాగి అక్కడ నుంచి అడవి లోపలికి వెళ్లిపోయాను. అలా నా వన దీక్ష ప్రారంభమైంది. పచ్చని దృశ్యాలు, కొండరాళ్లు, వందలకొద్ది నెమళ్లు, అవి చేసే నృత్యాలు... ఎండ కన్నుపడకుండా భూమాతకు గొడుగు పట్టినట్టున్న పొడవాటి చెట్లు, వాటి ఆకుల సందుల్లో నుంచి నేలను తాకే రవి కిరణాలు.. అబ్బురంగా తిలకిస్తూ ఎంత దూరం, ఎంత సేపు ప్రయాణించానో తెలియదు. అనువైన చోటు చూసుకొని ధ్యానానికి కూర్చున్నాను.


ధ్యానంలో మునిగి తిరిగి లేచేసరి చీకటి పడింది. వచ్చేటప్పుడు గుర్తులు పెట్టుకున్న సూచికల ఆధారంగా గుడికి చేరుకున్నాను. మళ్లీ చెరువులో స్నానం చేసి పొయ్యి వెలిగించి గిన్నెలో గుప్పెడు బియ్యం, కొద్దిగా పప్పు, ఉప్పు, కారం, నీళ్లు పోసి ఉడకబెట్టాను. ఆ గుడి దీపం వెలుతురులోనే తిని, కాసేపు దేవీ భాగవతాన్ని పఠించి పడుకున్నాను. అర్థరాత్రి సమయంలో మెలకువ వచ్చి చూస్తే కళ్ల ముందు అద్భుతం... అవి పౌర్ణమి రోజులు కావడంతో అడవంతా వెన్నెల... ఆ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. చెప్పలేనంత ఆనందం’’ అంటుంటే ఆయన ముఖంలో అప్పటి అనుభవం తాలూకు మెరుపు. అత్యంత భారీసైజులో ఉన్న గుడ్లగూబను చూడడం వంటి కొన్ని మేను జలదరించే జ్ఞాపకాలూ ఈ అటవీ విహారం ఆయనకు అందించింది.

మొక్కలు చెప్పిన పాఠాలు

అడవిలో చెట్ల మధ్య, హాయిగొలిపే గాలిలో ఒకసారి పట్టణం విజయ్‌కు గుర్తొచ్చింది. చెట్లను కొట్టి, బిల్డింగ్‌లు కట్టుకొని, బోనస్‌గా వచ్చే రకరకాల రుగ్మతలకు లోనై, వాటిని నయం చేసుకోవడానికి పడరాని పాట్లు పడే వారు గుర్తొచ్చారు. అడవిలో ఎన్నో ఔషధ మొక్కలు... ఆ గాలికి దూరమయ్యాం కనుకే ఎన్నో జబ్బులు బాధపెడుతున్నాయి అనిపించింది. ఆయుర్వేదంలోనూ ప్రవేశం ఉండడటం వల్ల ఏ మొక్క ఏ జబ్బును నయం చేస్తుందో తెలుసు. వాటి గొప్పతనం స్కూల్లో పిల్లలకు పరిచయం చేయడానికి కొన్ని అరుదైన ఔషధ మొక్కలను సేకరించానన్నారాయన. ఈ 21 రోజుల వనవాసం వల్ల ఆయనకు బోనస్‌గా కలిగిన మరో లాభం... ఏడు కిలోల బరువు తగ్గడం. ఆ స్వచ్ఛమెనగాలి, ఆ కల్మషరహితమైన నీరు, ఆ పచ్చని నేల ఇచ్చిన బలం మరో ఏడాది దాకా సరిపోతుంది. ఆ జ్ఞాపకం మాత్రం నూరేళ్ల దాకా నిలిచి ఉంటుంది అని చెప్తారు విజయ్‌కుమార్. ప్రస్తుతం ఆయన మొక్కల పెంపకంలో పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.

‘కుటుంబంలో ఎంత మంది ఉంటే అన్ని మొక్కలు నాటుదాం. తరిగిపోతున్న అడవులను కాపాడుకుందాం. మనల్ని మన నుంచే వేరు చేసే కాలుష్యానికి అడ్డుకట్ట వేద్దాం లేలేత చిగుర్లు తొడుకున్న మొక్క, ఉషోదయం వేళ మంచుబిందువుల్లో తడిసిన పువ్వును చూస్తే కలిగే అనుభూతిని భావి తరానికీ అందిద్దాం’ ఇది విజయ్‌కుమార్ పాఠాల్లో ఇక ఎప్పుడూ ఒక భాగంగానే ఉంటుంది. మరోవైపు ఈ 21 రోజుల అరణ్యవాసం ఆయన మదిలో చెరిగిపోని జ్ఞాపకంలా నిలిచే ఉంటుంది. భావితరాలకు వనం-మనం అనే స్ఫూర్తిని కలిగిస్తూ ఆయనతో పాటు పయనిస్తూనే ఉంటుంది.

అడవిలో ఉన్న మూడు వారాలూ విజయకుమార్ మెడలోతు దాకా చెరువు నీళ్లలో నిల్చొని పద్యాలను శ్రావ్యంగా పాడటం సాధన చేశారు. రోజూ నాలుగైదు గంటలు ధ్యానం, ప్రకృతి ఆస్వాదన, ఒంటిపూట భోజనం.. ఇదీ ఆయన దినచర్య. అరణ్యవాసం పూర్తి చేసి బయటికి వచ్చీ రాగానే మొదట ఆయన చేసిన పని... ఫోన్ ఆన్ చేసి తన తల్లితో మాట్లాడ్డం.
- నిర్మలారెడ్డి

Wednesday, May 18, 2011

ప్రేమ.. వైరాగ్యాల ఉమర్ ఖయ్యామ్

http://www.studiolum.com/wang/khayyam/khayyam-illustrations-golubev-mosaic.jpg
ఇరాన్‌లోని ఒక చిన్న పట్టణం నిషాపూర్‌లో జన్మించిన ఉమర్ ఖయ్యామ్‌ను రుబాయీ చక్రవర్తిగా చె ప్పుకుంటారు. జీవన తత్వాలను పొదిగేందుకు రుబాయీ ప్రక్రియను వాడుకున్న తొలికవి ఉమర్ ఖయ్యామ్. 1857లో యూరప్‌కు చెందిన అభిమాని ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్, ఖయ్యామ్ రుబాయీలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత ఖయ్యామ్ రుబాయీల మాధుర్యం ప్రపంచమంతా వ్యాపించింది. 1048సంవత్సరంలో మే 18న జన్మించి 1131 దాకా తన రుబాయీలతో సాహిత్య లోకాన్ని ఉర్రూతలూపిన ఉమర్ ఖయాం జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా .......
http://www.exoticindiaart.com/details/panels/omar_khayyam_wj36.jpg
అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం ఘంటసాల గొంతులోంచి "అంత ము లేని ఈ భువన మంత పురాతన పాంథశాల...'' అన్న పద్యం జాలువారినప్పుడు తొలిసారిగా ఉమర్ ఖయామ్ పేరు తెలుగు జనసామాన్యం లోకి వెళ్లింది.

అలాగే ఓ ఇరవై ఏళ్ల క్రితం ప్రసిద్ధ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ గొంతులో "హైరత్ మే హై ఊంచాయీ భీ గెహరాయీ భీ హై చారో తర ఫ్ బీడ్ భీ, తన్‌హాయీ భీ...'' అన్న ఖయ్యామ్ రుబాయీ ప్రతిధ్వనించినప్పుడు ఆ మాధుర్యంలో భరత ఖండమంతా పులకించిపోయింది.
http://images.exoticindiaart.com/batik/omar_khayyam_bc23.jpg
ప్రేమా? వైరాగ్యమా?
సమాజంలోని అరిష్టాలన్నిటికీ అసలు కారణం ఏమిటీ అని ఒక సాధువును అడిగితే..." మనుషుల్లో వైరాగ్యం సన్నగ్లిలడమే అన్నింటికన్నా పెద్ద కారణం'' అంటూ కుండ బద్దలు కొట్టాడు. కాదా మరి? వైరాగ్యం అంటే సర్వ సంగ పరిత్యాగమని కాదు. జీవితపు క్షణికత్వాన్ని అర్థం చేసుకోవడం. అలా జీవితం మీద భౌతిక విషయాల మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోకుండా ఉండడం. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలన్నీ ఈ జీవన సత్యాన్నే చాటిచెబుతుంటాయి. భౌతిక విషయాల క్షణికత్వం అర్థం కాకపోతే ఏమవుతుంది? అన్నీ తానే సొంతం చేసుకోవాలనే స్వార్థం పెరిగిపోతుంది. దోపిడీ, వంచనా పెరుగుతాయి. ద్రోహ చింతన, హింసాత్మక ధోరణి పెరుగుతాయి. పగలూ, ప్రతీకారాలతో మనుషులు

రాక్షసులవుతారు. ఇదే కదా జరిగేది?
పైన ప్రస్తావించిన " అంతములేని ఈ భువనమంత'' అన్న పద్యం ఈ లోకం ఒక బాటసారుల సత్రమనే కదా చెబుతుంది. ఈ సత్రంలో సామాన్య జనం నుంచి రాజులు, చక్రవర్తుల దాకా ఎందరెందరో బసచేశారు. అక్కడ నాలుగు రోజులు గడిపి ఒక్కొక్కరే మళ్లీ అంతా ఎటో వె ళ్లిపోయారు. ఇప్పుడ అక్కడ ఎవరి ఆనవాళ్లూ లేవు అంటాడు ఖయ్యామ్.
http://www.exoticindiaart.com/details/panels/omar_khayyam_wd44.jpg
సమాజంలోని అరిష్టాలన్నిటికీ అసలు కారణం ఏమిటీ అని ఒక సాధువును అడిగితే..." మనుషుల్లో వైరాగ్యం సన్నగ్లిలడమే అన్నింటికన్నా పెద్ద కారణం'' అంటూ కుండ బద్దలు కొట్టాడు. కాదా మరి? వైరాగ్యం అంటే సర్వ సంగ పరిత్యాగమని కాదు. జీవితపు క్షణికత్వాన్ని అర్థం చేసుకోవడం. అలా జీవితం మీద భౌతిక విషయాల మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోకుండా ఉండడం. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలన్నీ ఈ జీవన సత్యాన్నే చాటిచెబుతుంటాయి. భౌతిక విషయాల క్షణికత్వం అర్థం కాకపోతే ఏమవుతుంది? అన్నీ తానే సొంతం చేసుకోవాలనే స్వార్థం పెరిగిపోతుంది. దోపిడీ, వంచనా పెరుగుతాయి. ద్రోహ చింతన, హింసాత్మక ధోరణి పెరుగుతాయి. పగలూ, ప్రతీకారాలతో మనుషులు
http://iranpoliticsclub.net/history/scientists2/images/Omar%20khayyam%206%20Laleh%20Park,%20Tehran.jpg
ఏ కీర్తీ నిలవదు
కీర్తి ప్రతిష్ఠలు రావాలనీ, సమస్త మానవాళికీ తన ప్రతాపమేమిటో తెలియాలనీ, అందరూ తన ముందు దాసోహం అంటూ నిలబడాలని ఎంతో మందికి మహా కోరిక. కానీ, అలా ఆశించిన వారంతా అంతిమంగా ఏమైపోయారు అంటూ, ''ఎందరెందరు చక్రవర్తులు వచ్చారో, ఎన్ని సామ్రాజ్యాల్ని జయించి పరిపాలించారో, ఎంత మహదైశ్వర్యాన్ని అనుభవించారో చూశాం. కానీ వారు వెంట తీసుకుపోయిందేమిటి? వారందరూ, ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారు. వాళ్ల గురించి ఇప్పుడు ఎక్కడా ఏ ఆనవాళ్లూ లేవు'' అంటాడు.

అత్యంత సహజంగా జీవించడం మరిచిపోయి, మనుషులు అధికారం, ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారన్నది ఖయ్యామ్ వాదన. ఒక రుబాయీలో ఆ మాటే చెబుతూ... "మనుషుల పైన అధికారం చె లాయించే చక్రవర్తిత్వం కన్నా గొప్పది లేదనుకుంటారు కొందరు...ఈ లోకం కాదు, ఆ లోకంలో స్వర్గం సాధించడమే పరమావధి అని మరికొందరు... చేతుల్లో ఉన్నది వదులుకుని లేనిదేదో కావాలని

దానికోసం పరుగులు తీస్తారు. కానీ, ఎదుటే ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. '' అంటాడు. అయితే, మానవ వైఫల్యాలను మాత్రమే ప్రస్తావించి వదిలేయకుండా జ్ఞాన దిశగా నడిపించే ప్రయత్నం కూడా చేస్తాడు.
http://www.a-w-i-p.com/media/blogs/articles//omar_khayyam_rubiat_42.jpg
ఆనందమే మధువు
ఉమర్ ఖయ్యామ్ దృష్టిలో జీవన తత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కలిగే ఆనందమే మధువు. ఆయనకు ఈ లోకం ఒక మధుశాల. ఈ క్రమంలోనే.. "ప్రియా! ఈ గ్లాసును మధువుతో నింపు!, గడిచిన వాటి గురించిన విచారాల్నీ, రేపటి గురించిన భయాల్నీ మనసులోంచి కడిగేసెయ్. ఈ నిమిషాన్ని, నిశ్చల నిర్విచార సమాధిలో నిలుపగల ఉజ్వల మధువుతో నింపు! ఇప్పుడు ఇక్కడ ఉన్నాను.

రేపటికి నేను వేవేల ఏళ్లను కలిపేసుకున్న నిన్నలో కలిసిపోతానేమో ఎవరికి తెలుసు?'' అంటాడు ఖయ్యామ్. జీవితం పట్ల ప్రేమ, మరణాన్ని గురించిన వైరాగ్యం ఈ రెండూ ఖయ్యామ్ రుబాయీల్లో సమాంతరంగా సాగిపోతుంటాయి. జీవితానందం గురించిన ఆరాటం అందరిలోనూ ఉంటుంది. కానీ, మరణాన్ని గురించిన ధ్యాస మాత్రం ఏ కొందరిలోనో తప్ప ఉండదు. అందుకే పదే పదే ఆ స్పృహ కలిగించే దిశగా తన రుబాయీలను నడిపిస్తాడు.
http://www.seawaychina.com/productimages/-main/FIG-Omar-Khayyam-HN2247.jpg
అమృతత్వంలోకి...
"కాలమూ, విధీ కూడబలుక్కుని తమలోని మధురసాన్నంతా వడగట్టి, నిగ్గదీసి, ఎందర్నో అపూర్వ సుందర ఉజ్వల వ్యక్తుల్ని సృష్టించాయి.వాళ్లలో కొందర్ని మనం ప్రేమించాం కూడా. వారంతా ఇప్పుడు ఏమైపోయారు? వారి వంతుకి ఒకటి రెండు గ్లాసుల మధువును సేవించి ఒక్కొక్కరే మృత్యువులోకి పాకి అదృశ్యమైపోయారు.'' అంటాడు. అలా అని అస్తమానం మరణం గురించే ఆలోచిస్తూ ఉండిపోవద్దంటాడు ఒక రుబాయీలో ...

"మనం మట్టిలోకి దిగి మట్టిగా మారిపోయాక, అక్కడ మధువూ ఉండదు, పాటా ఉండదు మనకు చేతనయిందల్లా, ఇప్పుడు మన ముందున్న కాలాన్ని అద్భుతంగా వినియోగించుకోవడం. నిజానికి మనం అంతకన్నా ఏం చెయ్యగలం? అందుకే ఈ క్షణంలో నిలిచి ఇంకే ఆలోచనలూ లేకుండా అమృతంలోకి ఐక్యమవుదాం.''అంటాడు
http://www.okonlife.com/images/saghism.jpg
ఈ క్షణమే సమస్తం
గతంలోని చేదును గుర్తు చేసుకుంటూ కొందరు, భవిష్యత్తు గురించిన భయాలను తలుచుకుని కొందరు వర్తమానాన్ని జారవిడుచుకోవడాన్ని ప్రస్తావిస్తూ , నీ ముందున్న క్షణాల్ని ఆస్వాదించడానికే నీ జీవితం చాలదు. ఈ స్థితిలో గతం, భవిష్యత్తు మీదే గడిపే వారికి ఇక జీవితమేముంది? అంటూ ప్రశ్నిస్తాడు. " మన కాళ్ల కింది నుంచి కాలం ఎట్లా కొట్టుకుపోతోందో, ఎన్నిసార్లు చెప్పుకుని ఏం ప్రయోజనం?ఇంకా పుట్టని రేపూ, పుట్టి చచ్చిన నిన్న. వాటిని తలుచుకుని చిరాకు పడకు. ఈ రోజు హాయిగా తాగి అన్నీ మరిచిపోదాము. ఇప్పుడు అనే ఈ క్షణమే మిగిలింది మనకు'' అంటాడు.
http://fineartamerica.com/images-medium/rubaiyat-of-omar-khayyam-carl-purcell.jpg
అయితే ఎంత వర్తమానంలో తలమునకలై ఉన్నా మృత్యువు నిన్ను సమీపించకుండా ఉండదు. నిజానికి మృత్యువును సంపూర్ణంగా ఆమోదించే వాళ్లే జీవితాన్ని ఆమూలాగ్రం అనుభవిస్తారన్న భావననే ఖయ్యామ్ తన రుబాయీల్లో ఎక్కువగా పొదుగుతాడు. అందులో భాగంగానే "న దిపంచన రోజాపూలు నవ్వుతో పూసినంత కాలం కెంపు మధువును సేవించు. ఏనాడో నల్లని పానీయాన్ని పట్టుకుని మృత్యుదేవత నిన్ను సమీపించినప్పుడు దాన్నీ తాగు. జంకకు.'' అంటాడు.http://www.dollsofindia.com/dollsofindiaimages/sequin-art-paintings/omar-khayyam-and-saki-epitome-of-love-QQ01_l.jpg
వేళాకోళంగా...
ప్రపంచ గమనంలో మానవ జీవితపు నిస్సహాయత గురించి కూడా కొన్ని బలమైన భావాలు ఉన్నాయి. ఈ విషయాలే చెబుతూ "ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో తెలీకుండానే ఈ ప్రపంచంలోకి వచ్చాము. ఈ దిక్కుకు పోతున్నామనేది తెలియకుండానే నీళ్లకు మల్లే ఎటు కొట్టుకుపోతున్నామో పోతున్నాం.

అవును మరి! నన్ను అడక్కుండానే, నా ఇష్టం తెలుసుకోకుండానే ఎక్క్డడి నుంచో నన్ను ఇక్కడికి తోసేశారు. నన్ను అడగనైనా అడక్కుండా ఈలోకం నించి ఎక్కడికి గెంటుతారో, గెంటేస్తారు
http://fineartamerica.com/images-medium/omar-khayyam-g-g-dere.jpg
ఈ దూర్తత్వాన్ని మరిపించేందుకు
ప్రియా మధువు వంచు. '' అంటాడు. ఈ నిస్సహాయతల గురించి ఒక పక్క మాట్లాడుతూనే ఒక దశలో "నిన్ను ఈ లోకంలోకి ఈడ్చి తెచ్చి ఏది నిన్ను వేళాకోళం పట్టించిందో దాన్నే నువ్వు వేళాకోళం పట్టించు.'' అంటూ గడుసుతనాన్ని బయటపెడతాడు. ఏమైనా జీవన్మరణ తత్వాల్నీ, వాటిని ఆస్వాదించే వైనాన్నీ అద్భుతంగా చెప్పిన అరుదైన కవిగా ప్రపంచ సాహిత్యంలో ఉమర్ ఖయ్యామ్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనేది ఒక పరమ సత్యం.

Sunday, May 15, 2011

సిద్ధార్థుడు బుద్ధుడయిన వేళ * వైశాఖ పౌర్ణమి - బుద్ధ జయంతి.


దారీతెన్నూ లేకుండా పోతున్న ప్రపంచానికి కొత్తదారులు చూపిన మహనీయుడు గౌతమబుద్ధుడు. అనంతవిజ్ఞాన రాశి ఆయన. సాధన ద్వారా నీవు కూడా బుద్ధుడివి కావచ్చు అంటారాయన. వేలవేల సంవత్సరాల తాత్త్విక చింతనను చిగురుటాకులా వణికించి, కోట్లాది మంది మదిలో కొత్త ఆలోచనలు విచ్చుకొనేలా చేసిన మహనీయుడు బుద్ధుడు. వైశాఖ పౌర్ణమి (రేపు) బుద్ధ జయంతి. ఆ సందర్భంగా బుద్ధుని తత్త్వసారాన్ని వివరించే సంఘటనలు స్మరిద్దాం.

బుద్ధుని జీవితం ఒక సాధనా సోపానం. ఆయన తత్త్వం జీవితాన్ని పరిపూర్ణం చేసే అమృతం. తనకు సర్వసుఖాలూ ఉన్నా, ప్రపంచపు దుఃఖాన్ని తొలగించాలన్న తీవ్ర తపన సిదార్థునికి కునుకుపట్టనీయలేదు. భార్య అనురాగం గానీ, తన వారి పట్ల మమత గానీ, ఆయనను ఆపలేకపోయాయి. ఇల్లు విడిచి న డకసాగించాడు. వారాలు, నెలలు గడిచాయి. తిండి లేక, నిద్రలేక నీరసించాడు. అడుగులు తడబడుతుండగా ఒక చెట్టుకిందకు చేరి చతికిలపడ్డాడు. కళ్లు మూతపడ్డాయి. 'ఉరువేల' ఆ ప్రాంతం పేరు. అక్కడికి సమీపంలో ఒక గృహస్తు ఉండేవాడు. అతని పేరు సేనాని. సుజాత అతని కుమార్తె. తన కడుపు పండి, తన ఇంట వెలుగునిండితే రావిచెట్టుకు, నాగదేవత పుట్టకు మొక్కుచెల్లిస్తానని మనసారా ప్రార్థించింది. ఆమె ప్రార్థించినట్లే జరిగింది. మొక్కుతీర్చుకొనేందుకు సిద్ధమైంది సుజాత.

తన సేవకురాలైన పున్నను అడవిలోని మర్రిచెట్టు వద్ద శుభ్రపరచి రమ్మని పంపింది. పున్న అక్కడ శుభ్రం చేసి వచ్చిన వెంటనే సుజాత ఒంటరిగా అడవికి బయలుదేరింది. పుట్ట ఎదుట పాలునిండిన పసిడి గిన్నెను, పాయసం ఉన్న వెండి గిన్నెను ఉంచి భక్తిశ్రద్ధలతో నమస్కరించింది. పుట్టలోని సర్పం బయటకు వచ్చి సుజాతను ఆశీర్వదించింది. చీకటి పడుతుండడంతో ఇంటికి బయలుదేరేందుకు లేచింది సుజాత. త్వరత్వరగా అడుగులు వేస్తున్న సుజాతకు మూలుగు వినిపించింది. అట చూసిన ఆమెకు బంగారు ఛాయతో అలసి పడిన దేహం కనిపించింది. సుజాత ముంగాళ్లపై కూర్చొని అతనిని తట్టింది. అతని తలను ఒడిలో పెట్టుకుంది. అతడు బాగా అలసి స్పృహతప్పిపోయాడని గ్రహించింది. అతని నాలుక ఎండిపోయి ఉంది. దగ్గరలో నీరు లేదు. మరికాసేపు ఆలస్యం చేస్తే అతనికి ప్రాణాపాయం ఉందనిపించింది సుజాతకు.

ప్రేమనేర్పిన తల్లి

దట్టమైన చీకటి వేగంగా ప్రపంచాన్ని ఆవరిస్తున్నది. సుజాతకు ఇంటివద్ద విడిచి వచ్చిన తన నోముల పంట, బంగారుబాబు గుర్తుకు వచ్చాడు. స్పృహతప్పి ఉన్న వ్యక్తిలో తన బాబు రూపం ప్రతిఫలించినట్లయింది! చంటివాడి కోసం దాచుకున్న పాలను ఒక ఆకును దోనెగాచేసి, అందులో పట్టింది సుజాత. స్పృహతప్పి ఉన్న సిద్ధార్థ్దుడి నోటిలో ఆ పాలను పోసింది. కాసేపటికి సిద్ధార్థుడు కళ్లు తెరిచాడు. ఎదుట ఉన్న కరుణామూర్తి 'అమ్మా' అన్నాడు. ఆ తల్లి పులకించిపోయింది. ఆమె లేచినిలబడి, చేయి అందిస్తూ, లే నాయనా! అంది.

కొంచెం ఓపిక తెచ్చుకొని, నా వెంట నడువు. ఈ రాత్రికి నా ఇంట్లో విశ్రాంతి తీసుకొని, స్వస్థత చేకూరగానే నీ గమ్యం వైపు సాగిపో అన్నది. సిద్ధార్థుడు ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా! అగమ్యగోచరంగా, చుట్టూ శూన్యమే గోచరిస్తున్న నాకు, నీ మానవత్వంతో వెలుగు కనిపిస్తున్నది. నా అన్వేషణకు అర్థం స్ఫురిస్తున్నది. ఇక నీవు వెళ్లిరా అమ్మా! నా ప్రాణదాతవు నీవు. ఇదే నా ప్రణామం. అంటూ నీరు నిండిన నయనాలతో అంజలి ఘటించి నమస్కరించాడు గౌతముడు. నీకు బుద్ధత్వం సిద్ధించుగాక! అని మనసారా దీవించింది సుజాత. ఆ ప్రేమమూర్తి దీవెనలు వృధాకాలేదు. సిద్ధార్ధుడు బుద్ధుడయ్యాడు. ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు.

అమృతంగమయ

అసత్యాన్ని ఛేదించి, సత్యాన్ని కనుగొన్న వారిని, చీకటిని చీల్చి కాంతిరేకల్ని కనుగొన్న వారిని, మృత్యువును అధిగమించి అమృతత్త్వాన్ని కనుగొన్ని వారిని ఎవరూ ఏమీ చేయలేరు. అలాంటి వారిపట్ల ద్వేషభావాన్ని పెంచుకుంటే అది వారికే హానిచేస్తుంది. ఆ మహనీయుల గొప్పతనం మరింత ఇనుమడిస్తుంది. ఈ సత్యాన్ని తెలిపే బుద్ధుని జీవితంలోని ఒక సంఘటన ఇది. దేవదత్తుడు గౌతమ బుద్ధుని సమీపబంధువు. మారుటి సోదరుడు. గౌతముడంటే ముందు నుంచీ అతనికి అకారణంగా అసూయ, ద్వేషం. ఒకనాడు కొండపై నుంచి ఒక గుండును గౌతమునిపైకి దొర్లించాడు. ఆ గుండు గౌతముని మీద పడలేదు కానీ, ఆ గుండు కింద ఉన్న పాము దేవదత్తుడిని కాటు వేసింది.

దేవదత్తుడు బాధతో కేకలు వేశాడు. గౌతముడు తన అంగవస్త్రాన్ని చించి, దేవదత్తునికి పాము కరచిన చోట, విషం పైకి ఎగబాక కుండా గట్టిగా కట్టు కట్టాడు. నోటితో విషాన్ని పీల్చి పక్కకు ఉమ్మేశాడు. దేవదత్తునికి ప్రాణభిక్షపెట్టాడు. అతడిని ఇంటికి చేర్చాల్సిందిగా పరిచారకులకు చెప్పాడు. అయినా దేవదత్తుడికి బుద్ధిరాలేదు. రాకుమారుడైన అజాతశత్రువును ఆశ్రయించి, సహాయాన్ని కోరాడు. అజాతశత్రువు అతనికి కొంత పరివారాన్ని ఇచ్చాడు. వారిలో ఒకరిని దేవదత్తుడు ఉసిగొల్పాడు.

బుద్ధుడిని చంపాల్సిందిగా ఆయనపైకి పంపాడు. వాడు ఏకాంతంగా, మౌనంగా, ప్రశాంత వదనంతో కూర్చున్న బుద్ధుడిని సమీపించాడు. ఆయన శరీరం నుంచి వెలువడుతున్న శక్తివంతమైన ప్రేమ తరంగాలు అతనిలో పరివర్తనను కలిగించాయి. ఏమీ చేయలేక వాడు వెనక్కు తిరిగి వచ్చాడు. దేవదత్తుడికి తన అనుభవం చెప్పాడు.

కరుణామూర్తి గౌతముడు

మరోసారి దేవదత్తుడు రాజగృహంలోనే అత్యంత క్రూరమైన నలగిరి అనే మదపుటేనుగును బుద్ధుడిపైకి తోలించాడు. ఒకవేళ మదపుటేనుగు నుంచి తప్పించుకుంటే, వెంటనే ఆయన్ను చంపేందుకు కొందరు విలుకాండ్రను నియమించాడు. బుద్ధుడు తన శిష్యులతో వెళుతున్నప్పుడు భయంకరంగా ఘీంకరించుకుంటూ అటుగా వచ్చింది మదపుటేనుగు. అందరూ పరుగులు తీశారు. కానీ బుద్ధుడు ప్రశాంత దృష్టితో ముందుకు నడిచాడు. దగ్గరకు వచ్చిన ఆ ఏనుగు మంత్ర ముగ్ధలా నిలిచిపోయింది. తనకు ఇంతకు ముందు ఒకసారి ప్రాణభిక్ష పెట్టిన మహనీయుడే ఆయన అని గుర్తించింది. ఆయనముందు మోకరిల్లింది. మావటీవాని అంకుశం పోట్ల వల్ల ఏర్పడిన గాయం నుంచి కారుతున్న రక్తాన్ని చూసి గౌతముడు చలించిపోయాడు. తన అంగవస్త్రంతో ఆ గాయాన్ని తుడిచి, కట్టుకట్టాడు బుద్ధుడు. కృతజ్ఞతా పూర్వకంగా కన్నీరు కారుస్తూ కదిలిపోయింది మత్తగజం.

ప్రేమకు ప్రతిరూపం

గౌతముడిని హత్య చేయించేందుకు దేవదత్తుడు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అతని కుటిలబుద్ధి ప్రజలందరికీ తెలిసిపోయింది. వారి నుంచి అతనికి వచ్చే ధర్మాదాయం తగ్గిపోయింది. దేవదత్తుడు చివరకు ఇంటింటికీ వెళ్లి బిచ్చమెత్తి బతకాల్సి వచ్చింది. ఆ బతుకు బతకలేక కోసల రాజు ప్రసేనజిత్తు తనను ఆదరిస్తాడనే గంపెడు ఆశతో అక్కడి వెళ్లాడు. కానీ జరిగింది తెలుసుకున్న కోసల రాజు దేవదత్తుడిని నిర్దాక్షిణ్యంగా తన రాజ్యం నుంచి గెంటి వేశాడు. సోదరుడికే అంతటి హాని తలపెట్టిన వ్యక్తిని ఆదరిస్తే ప్రజలు నవ్విపోతారని గ్రహించిన ప్రసేనజిత్తు అలా చేశాడు. మహనీయుల పట్ల ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటే అవి రెట్టింపయి వచ్చి, మనల్ని నాశనం చేస్తాయంటారు వివేకానందులు. అందుకు దేవదత్తుని ఉదాహరణగా చెప్పకోవచ్చు. అపారమైన కరుణకు, ప్రేమ స్వభావానికి, శత్రువుకి సైతం హాని తలపెట్టని స్వభావానికి గౌతముడు ప్రతిరూపం... ఆ అద్భుత గుణాలే ఆయనను మహనీయుని చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన బోధలను ఆనుసరించేలా, ఆయనను ఆరాధించేలా చేశాయి. 
- రాచమడుగు శ్రీనివాసులు

Thursday, May 12, 2011

అంతరంగ ప్రపంచ ఆవిష్కర్త - జిడ్డు కృష్ణమూర్తి

సమస్య పరిష్కారం కోసం ఎక్కడెక్కడో వెతికి, వేసారి పోయే వారు కొందరు. అసలు సమస్య అంటేనే భయంతో వణికిపోయే వారు కొందరు. మనలో అమితంగా కనిపించే ఈ భయాలు, సమస్యల మూలాలేమిటో చాలా సార్లు ఒకపట్టాన అంతు చిక్కవు. ఇలాంటి సమస్యల పరిష్కారాల స్థావరాలేమిటో తెలియచెప్పిన గొప్ప సత్య విశ్లేషకుడు జిడ్డు కృష్ణమూర్తి. ప్రతి మనిషిలో ఉండే అతని అంతరంగ ప్రపంచాన్నీ, ఆ ప్రపంచమంతా విస్తరించిన అతని అనంత శక్తినీ గుర్తు చేస్తూ, గొప్ప స్పూర్తినింపిన తాత్వికుడు ఆయన. నేడు జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా ఒక పునస్మరణ.


సమస్యను అధిగమించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయితే భయం ఉండదు. ఆ సంసిద్ధత రావడానికి మనసంతా ఆ సమస్య మీదే లగ్నం కావాలి. కానీ, చాలా సార్లు అలా జరగదు. మనసు అలా లగ్నం కాలేకపోవడానికి సమస్య నుంచి పారిపోవాలనుకోవడమే కారణం. అలా అనుకోకపోతే అసలు భయమే ఉండదు.సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంటే పరిష్కారం ఆ సమస్యలోంచే పుట్టుకొస్తుంది. ఎందువల్ల అంటే పరిష్కారం అనేది సమస్యకు వేరేమీ కాదు.


* నీలో ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచoలోకి వెళ్లే తాళం చెవి కూడా నీ చేతిలోనే ఉంది. నిజానికి నీలో ఉన్న ఆ ప్రపంచపు ద్వారాన్ని నువ్వు తప్ప మరెవరూ తెరవలేరు. * ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నోట జాలువారిన సత్యాల్లో మచ్చుకు కొన్ని. జీవితంలోని ప్రతి సంఘటన గురించి, ప్రతి సమస్య గురించి అంత లోతుగా విశ్లేషించిన వ్యక్తి బహుశా మరొకరు ఉండరు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో (మే12, 1895) జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు. ఆయన చిన్నతనంలోనే ఆయన తలిదండ్రులు కడపకు వలస వెళ్లారు. కృష్ణమూర్తి పదేళ్ల వయసులో ఉన్నప్పుడే అతని తల్లి చనిపోయింది. తరువాత వారి మకాం కడప నుంచి మద్రాసుకు మారింది. అక్కడున్న కాలంలోనే కృష్ణమూర్తి థియోసాఫికల్ సొసైటీ నిర్వాహకులైన అనీబిసెంట్ దృష్టిలో పడ్డాడు. అప్పటికి ఆమె ఆ సొసైటీకి సంబంధించి ప్రపంచ గురువు అయ్యే యోగ్యతలు ఉన్న వ్యక్తి కోసం గాలిస్తోంది. ఆ లక్షణాలు ఆయనలో కనిపించాయి. అందుకే కృష్ణమూర్తి తండ్రిని ఒప్పించి ఆ గురుస్థానానికి కృష్ణమూర్తిని ఎంపిక చేసింది.


విషాదం నుంచి అంతర్మథన థియోసాఫికల్ సొసైటీలోకి ప్రవేశించిన కొద్ది రోజులకే కృష్ణమూర్తి అమితంగా ప్రేమించే తన తమ్ముడు క్షయవ్యాధితో మరణించాడు. అతని మరణం కృష్ణమూర్తిని తీవ్రమైన అంతర్మధనానికి గురిచేసింది. అది అతని ఆలోచనలను రగిల్చింది. అప్పటి నుంచి జీవిత వాస్తవాలనూ, జీవిత సత్యాలనూ అత్యంత నిశితంగా పరిశీలించడం మొదలయ్యింది. ఆ క్రమంలో గురుత్వం అనే భావనే సరికాదనిపించింది. ప్రపంచ గురువుగా తనను ప్రతిష్టించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ అర్థం లేనివనిపించింది.


సత్యాల్ని ఎవరికి వారు తెలుసుకోవలసిందే. తనకు తెలిసిన సత్యాలను ఎవరైనా ఇతరులతో పంచుకోవలసిందే. అంతే గానీ, ఎవరో గురుస్థానంలో ఉండిపోతే మిగతా వారంతా అతని శిష్యులై అతని చెప్పినవన్నీ వినుకుంటూ పోవడం సరికాదనిపించింది. అందుకే కృష్ణమూర్తి తాను కేంద్రంగా ఉన్న థియోసాఫికల్ సొసైటీని, దాని అనుబంధ సంస్థలన్నిటినీ రద్ధుచేశాడు. ఆ సొసైటీ కి విరాళంగా లభించిన 5 వేల ఎకరాల భూమిని ఆ దాతలకే తిరిగి ఇచ్చేశాడు. ఆ తరువాత వివిధ అంశాల మీద చర్చిస్తూ, ప్రపంచ దేశాలన్నీ పర్యటించడానికే తన జీవితాన్ని వెచ్చించాడు. జీవితంలోని దాదాపు ప్రతి అంశం మీదా మనోవిజ్ఞాన వేత్తలు, తత్వవేత్తలు, విద్యావేత్తలతో సమావేశమై సుదీర్ఘంగా చ ర్చించేవాడు.


మానవ జీవితంలోని వైరుధ్యాలు, ఘర్షణలు, దుఃఖం, అశాంతి, ఒంటరి తనం, అసంతృప్తి వంటి పలు విషయాల మీద ఆయన తన భావాలను వ్యక్తం చేశాడు. ఆయన చర్చించిన వాటిలో 'ఒంటరితనం' అనే విషయానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. "అణచివేయడం ద్వారానో, నిర్లక్ష్యం చేయడం ద్వారానో ఒంటరితనం ఎప్పుడూ తొలగిపోదు. కిక్కిరిసిన జనసమూహంలో ఉన్నా మనసులో అనుబంధం లేకపోతే నువ్వు ఒంటరితనాన్నే చవిచూస్తావు. మద్యమో మరో వినోదమో ఒంటరితనం నుంచి విముక్తి చేయలేవు. ఆ సమయంలో తాత్కాలికంగా పక్కకు వెళ్లినా ఆ తరువాత ఒంటరితనం మళ్లీ వచ్చి గుండెల మీద వాలిపోతుంది'' అంటాడు.


కృత్రిమ ప్రయత్నాల ద్వారా తాత్కాలిక ఉపశమనమే తప్ప ఒంటరి తనం నుంచి పూర్తిగా బయటపడలేవు అంటారాయన. ఎవరైనా నేరుగా ఒంటరితనపు గుహలోకే ప్రవేశించి నలుమూలలా నిశితంగా పరిశీలిస్తే గాని, ఒంటరిత నపు అసలు కారణాలు బోధపడవు అంటూ... "నిజానికి మన చర్యలన్నీ మనల్ని సంకుచిత పరిచేవిగానే ఉన్నాయి. మన ఆలోచనలు, మన లక్ష్యాలు పైకి ఎంత విశాలంగా కనిపించినా వాటిలో మనుషులు పరస్పరం విడిపోవడానికి దోహదం చేసేవే ఎక్కువ. ప్రతి ఒక్కరూ మరొకరిపై ఆధిపత్యాన్నే ఆశిస్తున్నారు.


ప్రతి పనినీ నీది-నాది అంటూ వేరువేరుగానే చూస్తున్నారు. సంఘాల పేరుతోనో, మతాల పేరుతోనో, దేశం పేరుతోనో అంతా విడివిడిగానే ఉంటున్నారు. మొత్తంగా మన వ్యవహార సరళి అంతా మనం విడిపోవడానికే దారి తీస్తోంది. క్రమంగా ఒక దశలో ఏ చర్యాలేని ఒంటరితనానికి చేరుకుంటాం. మనసులో ఒక శూన్యం ఏర్పడుతుంది. అయితే ఆ శూన్యాన్ని మనం భరించలేం. అందుకే వెంటనే ఆ శూన్యాన్ని పూరించాలని చూస్తాం. ఉన్నతంగానో, హీనంగానో ఎలాగోలా ఆ శూన్యాన్ని, ఆ ఖాళీని పూరించడానికి మన జీవితాన్నే వెచ్చిస్తాం.''అంటాడు. 

'' ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి కొన్నిసార్లు మనం ప్రేమ అన్న పదం మాటున తలదాచుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ, ప్రేమ, ఒంటరితనం ఈ రెండూ ఒకేచోట ఇమడలేవు. నువ్వు ప్రేమించే వ్యక్తి కోసం, నువ్వు అనుకున్న లక్ష్యం కోసమో నువ్వు అంకితం కావచ్చు. అయినా ఒక కటిక చీకటిలా ఒంటరితనం నిన్ను ఆవహించే ఉంటుంది. నువ్వు ప్రేమించినా, కడకు ద్వేషించినా ఒంటరితనం నిన్ను వెన్నంటే ఉంటుంది. కాకపోతే నీకు కొంచెం దూరంలో నీ కోసం ఎదురుచూస్తూ అనుక్షణం నిన్నే గమనిస్తూ కొద్ది క్షణాల పాటు కాస్త వెనక్కి జరిగి ఉండిపోతుంది. అయితే అదంతా మళ్లీ నిన్ను ఆవహించడానికే.'' అంటాడాయన.


అభద్రతా భావం మౌలికంగా ఒంటరితనంలో ఒక అభద్రతా భావం ఉంటుంది. అభద్రతా భావంతో మొదలైన చర్యలు పైకి ఎంత ఉదాత్తత కనిపించినా అవన్నీ మనసులోని సంకుచితత్వానికి కవచాలు మాత్రమే అంటాడు కృష్ణమూర్తి. తనకు తానే అందరికీ దూరమైపోయి కొందరు ఇతరులే తనను దూరంగా తరిమేశారు అనుకుంటారు. తనకెవరో ముప్పు తలపెట్టినట్లు భావించి ఏవో ఆత్మరక్షణా ప్రయత్నాలు మొదలెడతారు. ఇవన్నీ ఒంటరి తనపు భయాన్ని రెట్టింపు చేస్తాయంటారాయన. " శూన్యం నుంచి, అసంపూర్ణత నుంచి, ఒంటరితనం నుంచి పారిపోవాలని చూసే వ్యక్తి నిజనికి వాటికి వేరేమీ కాదు. శూన్యం, అంసపూర్ణత, ఒంటరితనం ఇవన్నీ అతని ఆలోచనల్లోంచి వచ్చినవే.


ఒంటరితనం నుంచి పారిపోవాలనే ఆలోచలన్నిటికీ మూలాలు అక్కడే ఉన్నాయి. దానికి ఎవరూ తమ నుంచి తాము పారిపోలేరు. తమను, తమ ఒంటరి తనాన్ని అర్థం చేసుకోవడం ఒక్కటే ఎవరైనా చేయగలిగేది. అలా కాకుండా వాటిని తనకు వేరుగా భావించినంత కాలం అతడు ఆ ఒంటరితనం నుంచి బయటపడలేడు. అందుకే తానే తన ఒంటరితనమని, తన ఆలోచనా ధోరణే తన ఒంటరితనానికి అసలు కారణమని గ్రహించినప్పుడే ఆ ఒంటరితనం నుంచి సంపూర్ణంగా బయటపడతాడు అంటాడు కృష్ణమూర్తి. తెలుగునేలపై జన్మించి, అంతర్జాతీయ తత్త్త్వవేత్తలలో ఒకరిగా, వారికి సైతం ఆరాధనీయుడుగా ఎదిగిన కృష్ణమూర్తి ఒక కొత్త ఆలోచనా స్రవంతికి మార్గం చూపిన మహనీయుడు.

Wednesday, April 27, 2011

జర్మనీ * జీవన విధానం - డాక్టర్ మధురవాణి

"పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసినప్పుడు నాకు ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు పెట్టి ఇక్కడి యూనివర్సిటీ ప్రమాణాలకు సరిపోతానో లేదో పరీక్షించారు. దానికి నాక్కొంచెం కోపం వచ్చింది. ఇండియాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒకటయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అరుదుగా వచ్చే డిస్టింక్షన్ సంపాదించిన నా డిగ్రీని సరిపోదంటారా - అన్న భావన వచ్చింది.
E-Pao! Photo Gallery
Munich University
కానీ ప్రపంచంలో 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ యూనివర్సిటీ పేరుండటం చూశాక నాకు అర్థమయింది - ఆ హోదాను, నాణ్యతను నిలుపుకోవడానికి వీరు తీసుకునే జాగ్రత్త అది అని...'' అంటున్నారు జర్మనీలో గడచిన ఆరేళ్లుగా ఉంటున్న డాక్టర్ మధురవాణి. మ్యూనిక్ నగరంలో పోస్ట్‌డాక్టరల్ సైంటిస్టుగా పరిశోధన చేస్తున్న ఈ యువతి ఆ దేశం గురించి బోలెడు ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చారు. అవి ఆమె మాటల్లోనే...
"నేను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్లాంట్ బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చదివాను. అక్కడ మా ప్రొఫెసర్లలో చాలామంది జర్మనీలోని వివిధ యూనివర్సిటీల్లో పరిశోధన చేసినప్పటి అనుభవాలను అప్పుడప్పుడూ చెబుతుండేవారు.

మా పీజీ ఆఖరి రోజుల్లో జర్మనీ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఇండియాలో పర్యటించింది. వారి ద్వారా జర్మనీలోని పరిశోధనా అవకాశాలు, ప్రమాణాల గురించి మాకు వివరంగా తెలిసింది. ఆ స్ఫూర్తితోనే నేను ఇక్కడ పీహెచ్‌డీకి దరఖాస్తు పెట్టుకున్నాను. నేను వచ్చేప్పటికి చేయబోయే పరిశోధన గురించి తప్పితే జర్మనీ జీవన విధానం గురించి నాకు అస్సలు అవగాహన లేదు. ఇక్కడికొచ్చాకే అవన్నీ తెలుసుకున్నాను.

భాషన్నా...యాసన్నా ప్రాణం...

జర్మన్లకు వారి భాషంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీనూ! మనం స్కూల్ వరకూ తెలుగు చదువుకున్నట్టు వీరు ఇంగ్లిష్, ఫ్రెంచి లాంటి భాషలు చదువుకుంటారంతే. ఉన్నత విద్య సైతం మాతృభాషలోనే అభ్యసిస్తారు. ఉదాహరణకు పీహెచ్‌డీ థీసిస్ కూడా వాళ్ల భాషలోనే రాసుకోవచ్చు. పబ్లిక్ స్థలాల్లో ప్రతీదీ జర్మన్ భాషలోనే రాసుంటుంది. ఇంగ్లీష్ వచ్చినా సరే సాధారణంగా మాట్లాడరు. తప్పని పరిస్థితిలోనే వారి నోటి వెంట ఇంగ్లీష్ వస్తుంది. ప్రత్యేకంగా మేముంటున్న బవేరియా ప్రాంతం వాళ్లకి వారి సంస్కృతి అన్నా, మిగతా జర్మనీ వారి కన్నా వైవిధ్యంగా ఉండే వారి యాసన్నా అమితమైన అభిమానం.

మాటలు తక్కువ...క్రమశిక్షణ ఎక్కువ

జర్మన్లు క్రమశిక్షణకి, సమయపాలనకి పెట్టింది పేరు. బస్‌గాని, రైలుగాని ఏడు ముప్పై ఒకటికి వస్తున్నట్టు షెడ్యూల్ ఉంటే సరిగ్గా ఏడు ముప్ఫై ఒక్క నిమిషంలోనే అది అక్కడ ఉంటుంది. మనుషులు రిజర్వ్‌డ్‌గా ఉంటారనిపిస్తుంది. అపరిచితులు ఎదురుపడితే కొద్దిగా నవ్వుమొహంతో హలో చెప్తారు. బస్సుల్లో రైళ్లలో అస్సలు మాటలు వినపడవు. వినిపించినా చాలా తక్కువ. అందరూ పుస్తకంలోనో, పత్రికల్లోనో తలదూర్చి ఉంటారు. యువత చెవుల్లోనైతే ఐపాడ్, లేదంటే చేతిలో వీడియోగేమ్స్‌తో కనిపిస్తారు తప్పించి అపరిచితులతో మాటామంతీ ఏమీ ఉండదు.

భలే బీర్ ఫెస్ట్...

ఇక్కడివారి ఆహారపుటలవాట్ల గురించి చెప్పాలంటే రకరకాల బ్రెడ్డులు, కేకుల తయారీలో నిష్ణాతులు వీరు. చీజ్‌లను బాగా ఇష్టపడతారు. బంగాళాదుంపలు బాగా పండిస్తారు, తింటారు. కాఫీ చాలా ఎక్కువగా తాగుతారు. ఇక్కడి ప్రత్యేకం అంటే బీఫ్, పోర్క్‌తో తయారుచేసే సాసేజ్‌లు. ఇంక బీర్ విషయానికొస్తే మంచినీళ్ల కన్నా బీర్ ఎక్కువ తాగుతారని అనొచ్చేమో. ఏటా సెప్టెంబర్ చివరి వారంలో మొదలై అక్టోబర్ మొదటి వారంలో ముగిసే బీర్ 'జాతర' ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 
http://www.wayfaring.info/wp-content/uploads/2007/06/beerfest.jpg
'అక్టోబర్ ఫెస్ట్' లేదా 'బీర్ ఫెస్'ట అని పిలిచే ఈ జాతర స్టివల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫోక్ ఫెస్టివల్ అంటారు. ఈ దేశంలో కొన్ని వందల ఏళ్ల నుండి బీరు తయారుచేస్తున్న బ్రూవరీస్ ఉన్నాయి. వాళ్లందరూ ఈ జాతరలో బీరు అమ్ముతారు. మిలియన్ల లీటర్లలోనే అమ్ముడుపోతుంది. ఈ బీర్ ఫెస్ట్ మొదలయ్యి పోయినేడాదికి 200 ఏళ్లు నిండాయట!

సాంకేతిక వ్యవసాయం...

ఇక్కడ బీరుకి ఉన్న ప్రాముఖ్యత తెలిసింది కాబట్టి బార్లీ పంట ఎంత ముఖ్యమైనదో ఊహించగలరు కదా! బార్లీ పంటలో వచ్చే ఒక ఫంగల్ వ్యాధి గురించిన పరిశోధనే మా ఇనిస్టిట్యూట్లో చేస్తుంటాం. ఈ దేశంలో వ్యవసాయం అంటే - బంగాళాదుంప, గోధుమ, బార్లీ, మొక్కజొన్న, రేప్‌సీడ్ పంటలే. టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడిన ఆర్థికవ్యవస్థ వీరిది.

ధనవంతులు గ్రామాల్లో నివసిస్తారు..

ఇక్కడ రైతులు చాలా ధనవంతులట. ఎవరికైనా పొలాలు ఉన్నాయంటే, గ్రామాల్లో ఉంటున్నారంటే వాళ్లు బాగా డబ్బున్నవారని అర్థం.http://farm4.static.flickr.com/3088/2604455318_f1355f7e0d.jpg
వాతావరణం గురించి చెప్పాలంటే సంవత్సరంలో మూడొంతులు చలికాలమే ఇక్కడ. వణికించే చలి, కుప్పలుతెప్పలుగా మంచు, ఎప్పుడోకానీ కనపడని సూరీడు... ఇలా ఉంటుంది. వసంతం వస్తే మాత్రం రంగురంగుల చెట్లూ పువ్వులతో చాలా అందంగా ఉంటుంది. పచ్చదనం చాలా ఎక్కువ. అలంకరణ అంటే కూడా చాలా ఇష్టం, ఇల్లు కళాత్మకంగా తీర్చి దిద్దుకుంటారు. క్రిస్మస్, ఈస్టర్ వీళ్లు బాగా చేసుకునే పండగలు.http://frameculture.files.wordpress.com/2010/12/fcgermanybikeshop2.jpg
కార్లున్నా...సైకిలే వాడతారు....
నేనుంటున్న మ్యూనిక్ నగరం పశ్చిమ జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలో అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన మొదటి పది మహా నగరాల్లో మ్యూనిక్ ఒకటి. నగరంలో కన్నా చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న గ్రామాలలోనే ధనవంతులు నివసిస్తూ ఉంటారు. గ్రామాల్లో జీవించడమే విలాసవంతం ఇక్కడ. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం బస్సులు, ట్రెయిన్లు, లోకల్ ట్రెయిన్లు చాలానే ఉన్నా, కార్ల సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచంలోనే కార్లప్రియులు అత్యధికంగా మోజుపడే బీఎమ్‌డబ్ల్యూ కార్ల పుట్టిల్లు ఈ ఊరే. చిత్రం ఏమంటే అందరికీ కార్లున్నా సైకిళ్ల వినియోగం కూడా ఎక్కువే. డెబ్భైఎనభైయ్యేళ్ల బామ్మలు, తాతలు సైకిళ్ల మీద తిరుగుతుంటే ఆశ్చర్యంగానూ, సరదాగానూ అనిపిస్తుంది. మా ప్రొఫెసర్ కూడా ఎప్పుడో అవసరమైతే తప్ప మామూలుగా సైకిల్ మీదే వస్తారు.
Mandarin Oriental Hotel Munich Germany
Mandarin Oriental Hotel – Munich
మహిళలపై ప్రత్యేక శ్రద్ధ...
ఇక్కడ పెళ్లిళ్లు చాలా తక్కువ. అలాగని కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండవనుకుంటే పొరపాటే! కుటుంబ బంధాల కన్నా వ్యక్తి స్వేచ్ఛకి విలువ ఎక్కువ. చిన్నవయసు నుంచే పిల్లలకు నచ్చింది చేసుకునే స్వేచ్ఛనిస్తారు. ఉదాహరణకు రెండేళ్ల పిల్లాడిని రెస్టారెంట్‌కు తీసుకొస్తే వాడికి మెనూ చదివి వినిపించి వాడికేది కావాలంటే అదే కొనిస్తారు. పెళ్లి చర్చిలో చేసుకోవడంతో పాటు రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవడం తప్పనిసరి ఇక్కడ. పిల్లల్ని కనడానికి చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టం లేకపోతే తండ్రి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
http://www.german-info.com/images/german_images/Munich-women-large.jpg
Munich rated best city in Germany for women
 
పిల్లలు తల్లి ఇంటి పేరునో, తండ్రి ఇంటి పేరునో వారసత్వంగా తీసుకోవచ్చు. అయినప్పటికీ ఎక్కువశాతం తండ్రి ఇంటి పేరే తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ పిల్లల జనన రేటు చాలా తక్కువగనక పిల్లల్ని కనేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. పిల్లలు ఉన్నవారికి పన్నులు తగ్గుతాయి. అలాగే, ప్రతీనెలా కొంత ఎక్స్‌ట్రా జీతం కూడా అందుతుంది. అంతేకాదు ఇక్కడ యూనివర్సిటీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కృషి చేసే విభాగం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగస్తులని ఎక్కువగా రిక్రూట్ చేస్కోవడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది ప్రభుత్వం.

కిండర్ గార్డెన్‌లో పిల్లలను చేర్పిస్తే తల్లిదండ్రులు కూడా వారానికి కొన్ని గంటలు వారితో గడపాలనేది రూల్. ఆడుతూపాడుతూనే బోలెడు విషయాలు నేర్చుకుంటారు పిల్లలు. బురదలో, మంచులో, వానలో ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటూ కనిపిస్తారు వాళ్లు. మా ఆఫీస్ పక్కనే ఉండే కిండర్ గార్డెన్‌లో పిల్లలను గమనించడం చాలా సరదాగా ఉంటుంది నాకు. మా కొలీగ్ వాళ్ల పిల్లలు అక్కడ ఉన్నప్పుడు తను ఒకరోజు వాళ్లకోసం ఏదైనా ఇండియన్ వంటకం వండి పెట్టమని అడిగింది. నేనూ మరో ఇద్దరు స్నేహితులూ వెళ్లి పాయసం, పులిహోర చేసి పెట్టాము. వాళ్లకి గ్లోబు చూపిస్తూ ఒక్కో వారం ఒక్కో దేశం గురించి కొద్దికొద్దిగా నేర్పిస్తూ ఇండియా వంతు వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచారన్నమాట. అదొక సరదా జ్ఞాపకం నాకు.

మ్యానిక్‌లో దీపావళి...

మ్యూనిక్‌లో తెలుగువారు బానే ఉన్నారుగానీ, ప్రత్యేకంగా సంఘంలాంటిది ఏమీ లేదు. తెలుగువారిలో విద్యార్థుల కన్నా ఉద్యోగస్తులు, ఇంజనీర్లు ఎక్కువ. బంగ్లాదేశీ, పాకిస్తానీ.. ఇలా ఆసియా దేశాలవారు నడుపుతున్న దుకాణాలున్నాయి. అక్కడ బియ్యం, కూరగాయలు, మసాలాలు ఇవన్నీ లభిస్తాయి. అలాగే ఇండియన్ రెస్టారెంట్లు కూడా బానే ఉంటాయి. కాకపోతే వాటిలో ఉత్తరాది వంటకాలే ఎక్కువ.

మ్యూనిక్‌లో ఇస్కాన్‌వాళ్ల కృష్ణుడి గుడి ఉంది. అక్కడికి భారతీయులతో పాటు స్థానిక జర్మన్లు కూడా వస్తూ ఉంటారు. వాళ్లలో దాదాపు హిందూమతం తీసుకున్నట్టు మారిపోయి కృష్ణప్రేమలో మునిగితేలే వారు చాలామందే కనిపిస్తారు. ప్రతి ఆదివారం పూజ తర్వాత అన్నసంతర్పణ జరుగుతుంది. ఈ కోవెల వాళ్లు ప్రతి ఏడూ జగన్నాథ రథయాత్ర చేస్తూ దేవుడి ఊరేగింపు ఉత్సవాన్ని మ్యూనిక్ వీధుల్లో చాలా ఘనంగా చేస్తారు. భగవ ద్గీతతో పాటు భారతీయ తత్వాన్ని తెలియజేసే పుస్తకాలను అమ్ముతారు, రకరకాల ప్రసాదాలను చేసి వీధుల్లో అందరికీ పంచిపెడతారు. రెండేళ్ల క్రితం యాత్రలో నేనూ పాల్గొన్నాను. మన సంప్రదాయ భరతనాట్యం నేర్చుకుని అందులో ప్రదర్శన ఇచ్చిన జర్మన్ యువతులను చూసి చాలా ముచ్చటేసింది. తెలుగువాళ్లంతా కలిసి దీపావళి బాగా చేసుకుంటారు.

ఇక్కడ సంతంటే ఎంతో ఇష్టం...

నాకు బాగా ఇష్టమయిన విషయం మరోటి చెప్పాలి. ఇక్కడ వారానికి రెండుసార్లు సంత జరుగుతూ ఉంటుంది. అప్పుడే పొలాల నుంచి తీసుకొచ్చిన తాజా కూరగాయలూ, పండ్లూ, రకరకాల చీజ్‌లు, పువ్వులు, పూలమొక్కలు... ఇవన్నీ అమ్ముతారు. మామూలు సూపర్‌మార్కెట్లలో కంటే ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మరింత తాజాగా దొరుకుతాయి కాబట్టి. చాలామంది ఈ సంతల్లో అన్నీ కొనుక్కోవడానికే ఉత్సాహం చూపిస్తారు.
http://www.puvep.com/images/fruit-market.jpg
మరొకటి - నె లకో రెండు నెలలకో కొన్ని ప్రదేశాల్లో సెకెండ్ హ్యాండ్ వస్తువుల సంత జరుగుతుంది. అక్కడ వస్తువులన్నీ మహా చవక. వసంతమనీ, ఎండాకాలమనీ రకరకాల సమయాల్లో జాతరలు జరుగుతుంటాయి. వీళ్లకివి బాగా ఇష్టం. హస్తకళా నైపుణ్యంతో తయారు చేసిన రకరకాల వస్తువులు అమ్మే స్టాల్స్ విరివిగా కనపడతాయి ఇలాంటి సమయాల్లో.''

" ప్రపంచంలో అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన మొదటి పది మహా నగరాల్లో మ్యూనిక్ ఒకటి. నగరంలో కన్నా చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న గ్రామాలలోనే ధనవంతులు నివసిస్తూ ఉంటారు. గ్రామాల్లో జీవించడమే విలాసవంతం ఇక్కడ. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం బస్సులు, ట్రెయిన్లు, లోకల్ ట్రెయిన్లు చాలానే ఉన్నా, కార్ల సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచంలోనే కార్లప్రియులు అత్యధికంగా మోజుపడే బీఎమ్‌డబ్ల్యూ కార్ల పుట్టిల్లు ఈ ఊరే'' 
http://www.mrunification.com/germany-munich3.jpg

Monday, April 25, 2011

గుడాఫీ * లిబియన్ నియంత కల్నల్ మొ అమ్మర్ గడాఫీ - ఒక తెలుగు వైద్యుడి స్వీయానుభవాలు

నియంత అంటే అంతా బ్యాడే కనిపిస్తుంది. కానీ గడాఫీని దగ్గరగా చూసిన వారికి అతడిలో బ్యాడ్ మాత్రమే కాదు, గుడ్ కూడా కనిపిస్తుంది. అందుకే అతడిని గుడాఫీ అని కూడా అనవచ్చేమో!

మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫారిన్ అసెస్‌మెంట్ వింగ్ ద్వారా లిబియాకు వెళ్లిన డాక్టర్స్ డెలిగేషన్‌లో ఇ.ఎన్.టి. స్పెషలిస్టుగా 1985 నుంచి పద్నాలుగేళ్లు, ప్రస్తుతం గడాఫీకి ఎదురు తిరిగి తిరుగుబాటు చేస్తున్న ప్రదేశాలలో ఒకటైన అల్‌మర్ నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో కొన్నాళ్లు పని చేశాను. నేను గొంతులో కాయల్తీసినవాళ్లు, చెవిలో కన్నాలు సరిచేయించుకున్న వ్యక్తులే కాక, ఎంతోమంది పరిచయస్తులు - నా లిబియన్ స్నేహితులు, ఇవ్వాళ రోడ్ల మీదకు వచ్చి తిరుగుబాటు చేస్తూ టీవీలో కనిపిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నా జీవితంలో ‘పీక్ పీరియడ్’ని ఆ దేశ ప్రజల సేవలో గడిపాను.http://quartetbooks.files.wordpress.com/2011/02/gaddafi_dw_politik__545028g.jpg
పద్నాలుగేళ్లంటే మాటలు కాదు, నన్ను హాఫ్ లిబియన్ అనొచ్చు. 1986 లో రెండు అమెరికన్ స్టెల్త్ బాంబర్లు అతి తక్కువ ఎత్తులో ఓ తెల్లవారుజామున మా ఇంటి మీది నుంచే ట్రిపోలీ వైపు వెళ్తుంటే, ఆ స్పీడ్‌కి మా ఇంటి కిటికీలు ఊగిపోవడం చూసిన ప్రత్యక్ష సాక్షిని. గడాఫీ ఏ రాత్రీ పడుకున్న చోట పడుకోడు. అతని ఇంటి మీద బాంబు వేసి వెళ్లిన అమెరికన్స్‌కది ‘ఫెయిల్యూర్ మిషన్’. గడాఫీకి ఏడుగురు డూప్‌లు ఉండేవాళ్లని పుకారు. ఆ నిజానిజాలు డూపులకే తెలియాలి. అరబిక్ భాష నాకు కొట్టిన పిండి కావడంతో ఆ ప్రజలకి తల్లో నాలుకనయ్యాను. రెండుసార్లు నేను గడాఫీని దగ్గర్నుంచి చూశాను. ఆయన స్పీచ్‌లు విన్నాను. ప్రొటోకాల్ ప్రకారంగా, ఆయన మా ఊరు వచ్చినప్పుడు అది నా డ్యూటీ కూడా. http://indepthafrica.com/wp-content/uploads/2011/03/Moammar-Gaddafi.jpg
నేను లిబియా వెళ్లిన కొత్తలో మా సీనియర్ ఇండియన్ డాక్టర్స్ నాక్కొంత హితబోధ చేశారు. ‘‘ఇది లిబియా అనబడు దేశము. ఇచ్చట ఫారినర్సందరూ ఫస్ట్‌క్లాస్ సిటిజన్స్. ఆ తర్వాతే లిబియన్స్. దానిక్కారణం వీళ్లకు సడెన్‌గా వచ్చిన గర్వాన్ని తొక్కిపెట్టే అధినేత. గాడిదల మీంచి తిన్నగా టయోటా కార్లలోకి దూకడంతో వచ్చిన తంటా ఇది. ఇది ముస్లిం కంట్రీ అయినా సర్వమత సామరస్యం ఉంది. ఆల్కహాల్ నిషిద్ధమే అయినా ఇంటి బాత్రూమ్‌లో బ్రువరీస్ పెట్టుకోవచ్చు. కావలిస్తే దానిక్కావలసిన ద్రాక్ష పళ్లన్నీ వీళ్లే మీ ఇంటికి ఫ్రీగా తెచ్చిస్తారు. ఇంత స్వాతంత్రం నీకు మరేదేశంలోనూ దొరకదు. కానీ ఒక ముఖ్యమైన వార్నింగ్. నీ వొకాబులరీలోంచి ‘గ’ అనే అక్షరంతో మొదలయ్యే ఏ భాషలోని ఏ పదాన్నైనా అర్జెంటుగా తొలగించెయ్. కల్లో కాదు, మనసులో కూడా అనుకోకు. ప్రామిస్ చెయ్’’ అన్నారు.
‘‘అమ్మ లిబియాయోయ్!’’ అనుకున్నాను.
http://www.breakingperceptions.com/wp-content/uploads/2010/04/muammar_al-gaddafi.jpg
* * *
సెప్టెంబర్ ఫస్ట్ ఆ దేశానికి ‘రివ ల్యూషనరీ డే’. మన ఆగస్టు పదిహేనునీ, వాళ్ల సెప్టెంబర్ ఫస్ట్‌నీ - ఇటు రాజీవ్ గాంధీని, అటు గడాఫీని లైన్ డ్రాయింగ్స్ వేసి, ఆ సిటీలో ఉన్న పది పదిహేను దేశాల వాళ్లందర్నీ ఇన్వాల్వ్ చేసి, పదిహేను రోజులు రిహార్సల్స్ చేయించి, ఓ రాత్రంతా మేరథాన్ ప్రోగ్రామ్ అర్గనైజ్ చేసి అదరగొట్టాననిపించుకున్నాను. ఇది గడాఫీకి తెలిసి, మా ముదీర్ (హాస్పిటల్ డెరైక్టర్) ద్వారా నాకు ప్రత్యేక శుభాకాంక్షలు పంపాడు. ఇది మీతో చెప్పుకోవద్దా. దటీజ్ గడాఫీ.
ఇక్కడి వరకూ నేనీ ఆర్టికల్ రాయడానికి గల అర్హతను మీ ముందుంచే ప్రయత్నం చేశాను.
- ఇక్కడ్నుంచే అసలు విషయం-


లిబియన్ నియంత కల్నల్ మొ అమ్మర్ గడాఫీ తెలివైనవాడు. రాజును దింపి ‘రివల్యూషన్’ తెచ్చినవాడు. ఇప్పుడా రివల్యూషనరీనే దింపాలన్న రివల్యూషన్ అక్కడ మొదలైంది. దీనిలో పది పర్సెంట్ లిబియన్స్ ఐతే, తొంభై శాతం అల్‌ఖైదా వాళ్లేనంటాడు గడాఫీ. కావడానికి ముస్లిం కంట్రీయే అయినా లిబియాలో మతానికి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. స్ర్తీలకు బురఖాల్లాంటి ఆంక్షలేమీ లేవు. ఇది అప్పట్లోనే, అంటే 1987 ప్రాంతాల్లోనే, ఇరాన్ లాంటి దేశాలకు నచ్చేది కాదు. అప్పుడు కొందరు గడ్డాలు పెంచుకున్న ముల్లాల్లాంటివాళ్లు విదేశాల నుంచి దొంగచాటుగా లిబియాలోకి వచ్చి, దేశంలోని అన్ని మసీదుల్లోనూ దాక్కుని, శుక్రవారం ప్రార్థనలకొచ్చిన లిబియన్లకి మత మౌఢ్యాన్ని బోధించసాగారు. కరపత్రాలు కూడా పంచారు. వార్త క్షణాల్లో తెలిసిపోయింది పెద్దాయనకి. అంతే. ఆర్మీ అన్ని మసీదుల్లోకి వెళ్లి అక్కడే ఆ గడ్డాల వాళ్లని కాల్చి పడేయడం, శవాల్ని బైటికీడ్చేయడం 1993 లోగా నాలుగైదుసార్లు జరిగింది. అలా జరిగినప్పుడంతా గడ్డాలున్న లిబియన్లందరూ క్లీన్ షేవ్‌తో తిరగాల్సొచ్చేది. గడ్డం పెంచితే షూట్ ఎట్ సైట్ ఆర్డరిచ్చిన గడాఫీ, తెలుగులో సార్థక నామధేయుడయ్యాడు ‘గడ్డాల్ని ఆపి’.http://arabia2day.com/wp-content/uploads/2011/03/83144936_Gaddafi_123035d.jpg
లిబియా విస్తీర్ణం చాలా ఎక్కువ. జనాభా తక్కువ. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ఎడారి ‘సహారా’ అక్కడే ఉంది. మరోవైపు బార్డరంతా మెడిటరేనియన్ సముద్రం. వాతావరణం గొప్పది. అక్కడ మూణ్ణెల్లు సమ్మర్. మన ఆంధ్రా వింటరంత ‘వేడి’గా ఉంటుంది. అక్కడ వాళ్లు సినిమాల్లో, టీవీల్లో ఫ్యాన్లు చూసి అవేంటని అడుగుతారు. ఎడారిలో మాత్రం పగలు యాభై, రాత్రి మైనస్ అయిదూ డిగ్రీలు ఉంటుంది. లిబియన్లు బైట ప్రపంచాన్ని ఈ మధ్యనే చూడ్డం నేర్చుకుంటున్నారు. ప్రపంచంలో కల్లా అతి గొప్ప డ్రైవర్స్ లిబియన్సే. కారైనా, విమానాలైనా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్సే కాక సేఫెస్ట్ కూడా. అదే వాళ్ల గొప్పతనం. ఫుట్‌బాల్ అంటే పిచ్చి. అదొక్కటే ఆడతారు. చూస్తారు. ఎక్కువమంది లిబియన్స్‌ని ‘అరబ్బీ మురబ్బాలు అనొచ్చు. వాళ్ల కోళ్లకు మూడు కాళ్లు. వాళ్ల మంచాలకి మూడే కోళ్లు. అందుకే పద్దెనిమిదేళ్లొచ్చిన ప్రతి మగాడూ కంపల్సరీ ఆర్మీ ట్రైనింగ్‌కి వెళ్లాలని రూలుందక్కడ.
http://static.guim.co.uk/sys-images/Guardian/About/General/2011/2/21/1298313339914/gaddafi-007.jpg
లిబియాలో ఫాన్లూ, ఏసీలు తప్ప అన్నీ దొరుకుతాయి. అన్నీ సబ్సిడైజ్డ్ రేట్లే. తిండి వస్తువులైతే మరీ చవక. గ్యాసూ, పెట్రోలు, ఆ మాటకొస్తే కార్లు కూడా కారు చౌక. ఉద్యోగం చేసినోళ్లకీ, చెయ్యని వాళ్లకీ కొంచెం తేడాతో నెలజీతాలిస్తారు. ఇక వాళ్లకేం తక్కువని ఈ రెవల్యూషన్? అనే ప్రశ్న తలెత్తకమానదు.

పదవిలో ఉన్న ఏ వ్యక్తికైనా కుర్చీ పోతుందేమోనని ఉండే భయంతో చేసే తప్పులే గడాీఫీ కూడా చేశాడు. జనాలకి ఆలోచించే టైమ్ ఇవ్వకుండా ఎప్పుడూ ఏదో ఓ టెన్షన్‌లో వాళ్లను ఉంచేవాడు. మూణ్ణెళ్లు మార్కెట్స్‌లో సబ్బులుండవు. ఏరియల్ వ్యూలోంచి చూడాలే గానీ, మనుషులంతా దిక్కుతోచని చీమల్లా సబ్బుల కోసం ఊర్లన్నీ తిరిగేస్తుంటారు. మరో యేడు, ఏవో మూడు నెలలు అగ్గిపెట్టెలు ఆపేస్తాడు. ఇంకో సంవత్సరం ఆర్నెల్లు సిగరెట్లు దొరకవు. అప్పుడు వాళ్లంతా రోడ్ల మీద తాగిపారేసిన సిగరెట్ పీకలు, ఫిల్టర్ ల కోసం రాత్రింబవళ్లూ వెదుక్కుంటూ ఉంటారు. సబ్బుల్లేకపోతే ఇటుక రుద్దుకుని, అగ్గిపెట్టెల స్థానే చెకుముకి రాళ్లు కొట్టుకుని దేశమంతా బతకడానికి అలవాటు చేశాడు. ఇదంతా వాళ్లని రాటుదేల్చాలనే సదుద్దేశంతో కాదు, బిజీగా ఉంచాలనేదే బిగ్‌బాస్ ఆలోచన. మట్టిలో చుట్టపీకలేరుకునేవాడు ఇక కుర్చీకేం ఎసరు పెట్టగలడు. అదీ అతని ఎత్తుగడ.


ఇంత తొక్కిపెట్టినా స్ప్రింగుల్లా తలెత్తిన కొందర్ని ఫుట్‌బాల్ స్టేడియంలో, పబ్లిక్‌ని బలవంతంగా లాఠీలతో ఆహ్వానించి, టీవీల్లో లైవ్ ఇస్తూ వారానికి నలుగురేసి చొప్పున బహిరంగ ఉరిశిక్షల్ని అమలు చేసేవాడు. లాకర్ బీ కేసులో ఫ్లైట్‌లో బాంబ్ పెట్టించి పేల్చేసి టెరర్రిస్ట్ కూడా అయ్యాడు.

http://topnews.in/healthcare/sites/default/files/Muammar-Gaddafi12.jpg
గడాఫీ చేసిన గొప్ప పనుల్లో ‘మాన్ మేడ్ రివర్’ ఒకటి. ఎడారిలో నది నిర్మించిన ఘనుడు. గొప్ప గొప్ప బిల్డింగులూ, అత్యంత నాణ్యమైన రోడ్లు, ఫ్లై ఓవర్లు మొన్న బాంబుల దెబ్బకు కుప్పకూలాయి.
ప్రపంచంలోకే అత్యుత్తమ క్వాలిటీ పెట్రోలు లిబియాలోనే ఉంది. దాన్నెక్కువ ధరకు అమ్ముకోవడం తప్పేమీ కాదు. ఇక అమెరికన్ల వ్యవహారం చెప్పేదేముంది? పెట్రోలు ప్రేమికులు కదా. ఆ వాసనున్న దేశాల వైపు ఆకర్షితులౌతారన్నది విశ్వమెరిగిన సత్యం. గడాఫీకిది తెలుసు గనుకే - ముందు నుండి అమెరికా ద్వేషి. అమెరికన్లకు ఈ రివల్యూషన్ కలిసొచ్చింది. గడాఫీని దింపేసి తమకనుకూలమైన గవర్నమెంట్‌న క్కడ ఏర్పాటు చేసుకోవడమే అమెరికా లక్ష్యం. అందుకే భారత్ సహా మిగిలిన చాలా దేశాలీ అమెరికా జోక్యాన్ని సహించడం లేదు.

అసలీ రివల్యూషన్ ఏమిటి? పక్కనున్న ఈజిప్టులో జరిగింది కనుక ఇక్కడా జరగాలా? ఈ రెబల్స్ లీడరెవరు? గడాఫీ అడుగుతున్న ప్రశ్న ఇదే. ‘‘ఎవరికప్పజెప్పమంటారీ దేశాన్ని?’’ బి.బి.సి ఇంటర్వ్యూలో అతను అన్న మాటలు ఇవే.‘‘ఈ రెబల్స్ లిబియన్స్ కాదు. అల్‌ఖైదా ఇన్‌ఫిల్‌ట్రేటర్స్. వాళ్లు మావాళ్లని ఎగదోస్తున్నారంతే. లిబియన్ పీపుల్ దె ఆల్ లవ్ మీ’’ అంటూ ఘంటాపథంగా చెప్పాడు. ఆర్మీ మొత్తం తన చేతుల్లోనే ఉంది. విదేశీ జోక్యం లేకపోతే, ఇలాంటి రెవల్యూషన్స్‌ని అరగంటలో అణిచి పారేసే సత్తా ఉంది.

http://static.guim.co.uk/sys-images/Guardian/Pix/pictures/2011/2/20/1298233710636/Muammar-Gaddafi.-007.jpg
కానీ, దిగి వచ్చి, మెజారిటీ ప్రజలకేం కావాలో తెలుసుకుని తదనుగుణంగా నడుచుకుంటే దేశం సుభిక్షమే అవుతుంది. కానీ ఆ ఛాన్స్ అమెరికావాళ్లివ్వరు. లిబియన్లు డిక్టేటర్‌తో మొహంమొత్తి డెమోక్రసీ కావాలనుకుం టున్నారు. దానికాదేశం రెడీ అవ్వాలంటే ముందు కావలసింది అక్షరాస్యత.
గడాఫీ లేని లిబియా, అమెరికన్ క్రూక్‌లు చింపిన విస్తరే. తొందరలో మీరే చూస్తారుగా!

http://www.swen.ch/tl_files/swen/images/aktuell/Sept%2009/Gaddafi.jpg
  లిబియన్ నియంత కల్నల్ మొ అమ్మర్ గడాఫీ తెలివైనవాడు.
రాజును దింపి ‘రివల్యూషన్’ తెచ్చినవాడు.
ఇప్పుడా రివల్యూషనరీనే దింపాలన్న రివల్యూషన్ అక్కడ మొదలైంది!!


‘‘ఎవరికప్పజెప్పమంటారీ దేశాన్ని?’’ అని
బి.బి.సి ఇంటర్వ్యూలో అడిగారు గడాఫీ.
ఈ రెబల్స్ లిబియన్స్ కాదు. అల్‌ఖైదా ఇన్‌ఫిల్‌ట్రేటర్స్ అంటారాయన.