Monday, October 25, 2010

‘సహ్యాద్రి’

మన దేశానికి పశ్చిమ తీరాన్ని అనుకుని పర్వత శ్రేణులు ఉన్నాయి. వాటిని పశ్చిమకనుమలు అంటారు. ఈ పర్వతశ్రేణి గుజరాత్ నుండి గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను తాకుతూ కన్యాకుమారి వరకు వ్యాపించి ఉంది. 1, 59, 000 చదరపు కిలోమీటర్లున్న ఈ అందమైన పర్వతశ్రేణిని ‘సహ్యాద్రి’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 5000 రకాల పూల మొక్కలు, 139 రకాల జంతువులు, 508 రకాల పక్షులు నివాసముంటాయి.

అయితే కొన్ని దశాబ్దాలుగా మహారాష్టల్రో పెరుగుతున్న నగరీకరణ, గనులు, స్టీలు, విద్యుత్ కర్మాగారాలు, కర్ణాటకలోని ఆనకట్టలు, కేరళ, తమిళనాడులలో వ్యవసాయ భూముల కోసం అడవులను ఆక్రమించడంతోపాటు కాలు ష్యం కారణంగా సహ్యాద్రి అడవులు కుంచించుకుపోతున్నాయి.

1980లో పాండురంగ్ హెగ్డే ’Save western ghats'అనే ఉద్యమం మొదలు పెట్టారు. 20 చిన్న స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ఈ ఉద్యమం వల్ల 1984లో కర్ణాటకలోని ‘సెలైంట్ వ్యాలీ’లో ఆనకట్ట నిర్మా ణాన్ని ఆపి వేసి, ఆ ప్రదేశాన్ని ‘నేషనల్ పార్కు’ గా ప్రకటించారు.

2006లో ‘ప్రకృతి’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పరిచిన పాండురంగ్ హెగ్డే ఇప్పటికీ ఈ పర్వతశ్రేణిలోని అడవులను, పర్యావరణాన్ని సంరక్షించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు.

No comments:

Post a Comment